మావోయిస్టు పార్టీ మీద, విప్లవ ప్రజా సంఘాల మీద నిషేధాన్ని ఎత్తివేయాలి
(మావోయిస్టు పార్టీ మీద, విప్లవ ప్రజా సంఘాల మీద నిషేధాన్ని ఎత్తివేయాలి, తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్-1992ను రద్దు చేయాలి అనే డిమాండ్ల మీద డిసెంబర్ 30 శనివారం హైదరాబాదులో ఉదయం 10.30 నుంచి సాయంకాలం 5 గంటల దాకా విరసం నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నోట్) ప్రజాస్వామ్యం అంటేనే వేర్వేరు రాజకీయాల మధ్య సంభాషణ. ప్రజలు తమకు ఇష్టమైన రాజకీయాలను ఎంచుకోవడం. వ్యక్తిగతంగా తమ అభివృద్ధికి, ప్రగతికి ఏ రాజకీయాలు కావాలో నిర్ణయించుకొనే స్వేచ్ఛ ఉండటం. పార్టీలుగా, సంస్థలుగా సంఘటితమై వాటిని ఆచరించడం. మొత్తంగానే సమాజ వికాసానికి ఏ రాజకీయాలు దోహదం చేస్తాయో నిరంతర చర్చ కొనసాగడం.










