వ్యాసాలు

సభ్యత  ఆదివాసులే  నేర్పించగలరు

మానవ సమాజం ఉత్పాదక శక్తులను ఎంతగా అభివృద్ధి చేసినా, ఎన్ని శాస్త్రీయ ఆవిష్కరణలు చేసినా, ఎన్ని సాంకేతిక నైపుణ్యాలు సాధించినా, ఎన్ని అధునాతన పరికరాలను తయారు చేసినా, అది నాగరికత  ప్రాథమిక పాఠాలను కూడా నేర్చుకోలేదని వాస్తవాలు గొంతు చించుకొని చెబుతున్నాయి. సభ్యత అనే ఈ ప్రాథమిక పాఠాన్ని ఆదివాసీ  సమాజం మాత్రమే నేర్పించగలదు. మొదటి పాఠం - మనిషి ప్రకృతిని జయించలేడు, దానితో సాంగత్యాన్ని ఏర్పరచుకోగలడు.  ఆదివాసేతర నాగరికత, ఆధునిక సమాజం ఆదివాసీల నుండి నేర్చుకోవలసిన మొదటి పాఠం ఏమిటంటే, మనిషి ప్రకృతిని జయించాడని లేదా జయించగలడు అనే ఆలోచనను ఎప్పటికీ వదిలివేయాలి. ప్రకృతి నియమాలను తెలుసుకోవడం
సాహిత్యం వ్యాసాలు

మునికాంతపల్లి కతలు

పాఠకుడి నోట్సు ప్రవేశిక:నదుల వొడ్లు ( మన శ్రీపాద వారి గోదావరి వొడ్డు), సముద్రతీరాలు (తగళి శివశంకరపిళ్ళై "రొయ్యలు"),  ఎడారి మైదానాలు ( పన్నాలాల్ పటేల్ 'జీవితమే ఒక నాటక రంగం') కథలకు పుట్టినిల్లులా? యేమో!బహుశా ఇసుకకు కథా, నవలా సాహిత్యానికి  విడదీయరాని దగ్గరి-దూరపు చుట్టరికం యేదో ఉంది. అలాంటి ఒక చిన్ననది  సువర్ణముఖి. నెల్లూరుజిల్లా నాయుడు పేట పక్కన తొండనాడు ముఖద్వారపు నదిగా... దాని ఒడ్డున ఒక  మునికాంతపల్లి  మాలవాడ. ఆ మాలవాడనుంచి సాహిత్యం వస్తే ఎట్టా వుంటుందిరయ్యా? మడిగట్టుకున్న  అగ్రహారపు వాక్యమై అస్సలు వుండదు. అన్ని సాంప్రదాయిక మర్యాదలనూ ఎడమకాలితో అవతలికి తోసే పొగరు కనిపించ
వ్యాసాలు

మన  రైతాంగ భవితవ్యం WTO దయా దాక్షిణ్యాల్లో

విధ్వంసం  విధ్వంసం నుండి కాదు విధ్వంసం లేకుండా నిర్వహించడం సాధ్యం కాని వ్యాపార ఒప్పందాల నుండి ఉద్భవిస్తుంది. -బెర్టోల్ట్ బ్రెచ్ట్ గత 20 ఏళ్లలో 3,50,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మూడు రైతు వ్యతిరేక దుర్మార్గ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చేసిన ధర్నాలో  700 మంది రైతులు అమరులయ్యారు. నవంబర్‌లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే, మూడు చట్టాలను రద్దు చేసి, కనీస మద్దతు ధరపై పటిష్టమైన చట్టం చేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించాడు. పేద రైతుల కోసం, దేశాభివృద్ధి కోసం ఈ చట్టాలను రూపొందించామని, కానీ వాటి
కారా స్మృతిలో సాహిత్యం

కారా కథల్లో కొన్ని వైరుధ్యాలు

కాళీపట్నం రామారావు కథల ప్రాసంగికత గురించి, పాత్రల గురించి, కథాముగింపుల గురించి  చాలా కాలం నుంచి చర్చ జరిగింది.ఆయన కథల గురించి మాట్లాడుకోవడమంటే యాభై ఏళ్ల కిందటి తెలుగు సమాజం (అది ఉత్తరాంధ్రే కావచ్చు) గురించి మాట్లాడుకోవడమే.కారా తన కాలపు గడ్డు వాస్తవికతను నేరుగా చిత్రించిన వాడే.అయితే ఏ రచయితైనా తనకున్న దృక్పథం మేరకే తను రాయాలనుకున్నది రాస్తాడు.తన పరిశీలని శక్తి ప్రముఖమైన పాత్ర నిర్వహిస్తుంది.సామాజిక వాస్తవికతను సరిగ్గా పట్టుకున్న రచనలో ఆ సామాజిక వాస్తవాని కున్న అన్ని కోణాలూ ప్రతిఫలిస్తాయి.ఏదోమేరకు పాఠకుల అంచనాకు అందుతాయి.మనం 2021 లో నిలబడి 1960ల నాటి రచనల్లో , యిన్ని సంవత్సరాల
వ్యాసాలు

కనీస మద్దతు ధరవెనుక వాస్తవం

నీటి కొరతతో బాధపడుతున్న పంజాబ్‌లో పంటల వైవిధ్యీకరణను అమలు చేయడం నేడు చాలా అవసరం. కానీ గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో పప్పుధాన్యాలు, ప్రత్తి, మొక్కజొన్న ఉత్పత్తి, సేకరణ గణనీయంగా తగ్గింది. ఈ పంటలను సాపేక్షికంగా చాలా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేయడం వల్ల వచ్చే ఐదేళ్లలో ఈ పంటలకు సంబంధించి  కేంద్రంపై దాదాపుగా ఎటువంటి భారం పడదు. పంజాబ్‌లో వ్యవసాయం స్థితిగతులు ఏమిటో, రైతు సంఘాలు ఢిల్లీ చలో అనే నినాదంతో పెద్ద ముందంజ వేయడానికి ఎందుకు సిద్ధమవుతున్నాయో చూద్దాం. ఫిబ్రవరి 18 వ తారీకు ఆదివారం అర్ధరాత్రి వరకు నిరసనకారులతో జరిగిన నాలుగో విడత చర్చల్లో
వ్యాసాలు

సమాధి వెనుక దాగిన చరిత్ర

ఔరాంగజేబు చిన్ననాటి తరగతి గది చరిత్ర పాఠంలో విన్నపేరు. 1705 చనిపోయిన వ్యక్తి తదనంతర కాలంలో జీవిస్తున్నాడు. మరణాంతర , ఒకనాటి  పాలకుని గురించి అంచనా ఏమిటి? నిరంకుశ, దయామయుడైన పాలకుడా , లేదా, అనేది ఇవాల చర్చ ఎందుకు?  చరిత్రలో అనేక పరిశీలనలు సహజం. ఔరాంగజేబు మరణించి మూడు వందలఏళ్ల కాలం గడిచింది. 'ఒక రాణి ప్రేమ పురాణం ఇది కాదోయ్ చరిత్ర' అన్నాడు శ్రీశ్రీ.1705 కి ముందు ఏమి జరిగింది. ఔరంగ జేబు  ఇవాళ్టి భారతదేశానికి పాలకుడు కాదు. అతని రాజ్యవిస్తరణకు పరిమితి వుంది. హిందూ దేవాలయాల నేలమట్టం చేయడం, హిందుత్వ సంస్కృతిని అణిచి వేయడం
కారా స్మృతిలో సాహిత్యం

కారాతో మేము..

కాళీప‌ట్నం రామారావు మాస్టారితో నా పరిచ‌యం బ‌హుశా 1967 జ‌న‌వ‌రిలో మొద‌లైంద‌నుకుంటాను. అప్పుడు నా వ‌య‌స్సు ప‌దిహేను సంవ‌త్సరాలు. తొమ్మిదో త‌ర‌గ‌తిలో నిల‌దొక్కుకుంటున్న సమ‌యం. అదీ యువ దీపావ‌ళి ప్ర‌త్యేక సంచిక‌లో వ‌చ్చిన యజ్ఞం  కధ‌తో... కారా ఊరు ముర‌పాక. నా బాల్యంలో కొంత భాగం గ‌డిచిన మా అమ్మ‌మ్మ ఊరు వెన్నంప‌ల్లి లాంటిది. నేను పుట్టి పెరిగిన గాజులప‌ల్లి చాలా చిన్న ఊరు. అప్ప‌టి నా స్థితి- ఇప్ప‌టికీ వ‌ద‌లని - ప‌ల్లెటూరి జీవితానుభ‌వం... అత్యంత కౄర‌మైన భూస్వామిక దోపిడీ, పీడ‌న - హింస, వివ‌క్ష‌త‌లో కూడా బ‌త‌క‌డానికి నా చుట్టూ ఉన్న మ‌నుషులు చేసే భీక‌ర
కారా స్మృతిలో సాహిత్యం

మాస్టారితో నా గ్యాపకాలు కొన్ని !

మాస్టారు ఇక మనల్ని విడిచి ఏ క్షణమో వేలిపోతారని గత ఏడాది మార్చిలో ఆయన ఆసుపత్రిలో చేరినపుడు అన్పించింది. అయితే ఆయన గట్టి పిండం. వైద్యుల వూహకు అందని రీతిలో కొన్నాళ్ళకు తేరుకున్నారు. ఆసుపత్రిలో చేరిన నాటికి కిడ్నీ, వూపిరితిత్తులు అర్ధ భాగాలే పనిచేస్తున్నయట. పనిచేయని అర్ధభాగాలను మరి బాగు చేయలేరట, పనిచేసే భాగాలు కూడా ఎన్నాళ్ళో చేయవని వైద్యులు  జ్యోతిశ్యం  చెప్పారు నమ్మకంగా.  అంచేత అలా ఇక ఏ క్షణమో అననుకున్నాము. కానీ మాస్టారు వైద్యుల జ్యోతిశ్యాన్ని వమ్ము చేసి   ఆసుపత్రి నుంచి వచ్చాక ఏడాది పైగా నిలబడ్డారు.    ఈమధ్యలో కొన్నాళ్ళు శరీరం అతని మాట
వ్యాసాలు

బాల్జాక్ ప్రపంచంలో..

(ఇటీవల విరసం విడుదల చేసిన ముక్తవరం పార్థ సారథి  *బాల్జాక్ జీవితం - సాహిత్యం* పుస్తకానికి రాసిన ముందుమాట ) ముక్తవరం పార్థసారథి గారికి శరీరం లేదు. ఒక హోదా లేదు. అవార్డులు, రివార్డులు లేవు. పబ్లిసిటీ లేదు. ప్రచారం లేదు. ముఠాలు లేవు. సాహిత్యమే పార్థసారథి గారు. ఆయనతో మాట్లాడితే సాహిత్యం మాట్లాడుతున్నట్లు ఉంటుంది. ఆయన్ని ఎరిగినవాళ్లు సాహితీ సంపదని ఎంతోకొంత సంగ్రహించకుండా ఉండరు. అందుచేతే ఎరిగినవాళ్లు, ఆయన్ని ఎరగని వాళ్లలా నడుచుకుంటారు. అయినా కించిత్తు కూడా విచారించరు. బావిలో నీళ్లు చేదకపోతే వూట తగ్గిపోతుందేమోనన్నట్టుగా, నిరంతరం ఒక ప్రవాహంలా సాహిత్యాన్ని వెలువరిస్తారు. ఆర్బిఐ లో అధికారిగా
సాహిత్యం వ్యాసాలు

నిశ్శబ్దంగా నిష్క్రమించిన రచయిత

మూడేళ్ళ క్రితం ఓ పెద్దాయన నన్ను వెదుక్కుంతూ మా కాలేజీకి వచ్చారు. డెబ్బై ఏళ్లు ఉండొచ్చు. నల్లగా, అంత ఎత్తూ కాని, లావూ కాని పర్సనాలిటీ. మనిషి చాలా నెమ్మది అని చూడంగానే అర్థమవుతుంది. పరిచయం చేసుకొని తాను రాసిన కథల గురించి చెప్పారు. దేవిరెడ్డి వెంకటరెడ్డి - పేరు విన్నట్టుగా ఉంది. కథలు గుర్తు రావడం లేదు. ఇప్పటి వరకు పుస్తకం పబ్లిష్ చేయాలనుకోలేదని, ఇప్పుడు ఆ ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. దీన్ని విరసమే ప్రచురించాలని తన కోరిక అన్నారు. నేను సంస్థలో చర్చిస్తానని చెప్పాను. ‘ముందుమాట మీరే రాయాలి’ అన్నారు. ఆశ్చర్యపోయాను. విరసం సరే, నేను