సాహిత్యం వ్యాసాలు

*చాయ్ గ్లాస్‌* విశ్లేష‌ణ 

సుదీర్ఘ కాలంగా  జైలు జీవితం అనుభవిస్తున్న కామ్రేడ్ నర్మద క్యాన్సర్ వ్యాధితో మరణించడం భారత విప్లవోద్యమానికి ఒక లోటు. ఆమె కఠినమైన విప్లవకర జీవితాన్ని ఎంచుకోవడం, జీవిత కాలమంతా దానితో మమేకం కావడం, అనారోగ్య సమస్య వున్నా నిమగ్నమై పని చేయడం, తాను పని చేస్తున్న క్రమంలో కేవలం కార్యకర్త గానే కాకుండా తాను పని చేస్తున్న కార్య క్షేత్రంలో జరుగు తున్న అనేక నిర్మాణ రూపాలను,  పాలక వర్గాల అణిచివేత చర్యలను ఆదివాసీ జీవితాల్లోని పితృ స్వామ్య సంబంధాలను పురుషుని ఆధిక్యతను ,పెత్తనాన్ని, అందులో వ‌స్తున్న మార్పుల‌ను  నర్మద హృదయ గతం చేసుకున్నారు. భారత విప్లవోద్యమంలో   ఆమె
సాహిత్యం వ్యాసాలు

రారా విమర్శలో ఆధునికత ఎంత?

రాచమల్లు రామచంద్రారెడ్డి  గురించిన అంచనా లేకుండా తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శ పురోగతిని నిర్ధారించలేం.  సాహిత్య విమర్శలోని కొన్ని అంశాల్లో ఆయన  ప్ర‌త్యేక ముద్ర‌ వేశారు.  విమర్శలోకి ఒక వరవడిని తీసుకొచ్చారు. ఆ రోజుల్లో మంచి వచనం రాసిన కొద్ది మందిలో ఆయన ఒకరు. చాల సూటిగా, నేరుగా, పదునుగా ఆయన వాక్య విన్యాసం ఉండేది.   తన రచనలతో ఆయన విమర్శ రంగాన్ని ముందుకు తీసికెళ్లారు.  అయితే ఆయన ఎంత ముందుకు తీసికెళ్లారు?  ఆందులో ఆయన ప్రత్యేకత ఏమిటి?  పరిశీలించాలి. విమర్శలో  నిక్కచ్చిగా ఉంటాడని  ఆయనకు  పేరు.  కాబట్టి ఆయన విమర్శను కూడా అలాగే చూడాలి.     మనం
వ్యాసాలు

ఇజ్రాయిల్ జైళ్ళలో పాలస్తీనా మహిళా జర్నలిస్టులు

పాలస్తీనా జర్నలిస్టులపై దాడులు ఎప్పుడూ విస్తృతంగానే జరుగుతున్నాయి. పాలస్తీనా మీడియా ఉద్యోగులను ఇజ్రాయెల్ అధికారులు తరచూ "రెచ్చగొడుతున్నారనే" నేరారోపణతో  “రహస్య సాక్ష్యం” వుందని, "పరిపాలనా సంబంధ ఖైదీలు"గా జైలు శిక్షకు గురిచేస్తారు. ఈ రెండు ఆరోపణలు కూడా అబద్ధం. ఇజ్రాయెల్ నేరాలను బహిర్గతం చేయకుండా జర్నలిస్టులను అడ్డుకునేందుకు ఉద్దేశించినవే. ఇతర ఖైదీల మాదిరిగానే ఇజ్రాయెల్ జైళ్లలో జర్నలిస్టులు హింస, కొరడా దెబ్బలు, అవమానం, హింసలకు గురవుతున్నారు. అంతేకాదు, వారికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంపర్కమూ లేదు. 2024 జులై 11 నాటికి ఇజ్రాయెల్ జైళ్లలో ఆరుగురు పాలస్తీనా మహిళా జర్నలిస్టులు ఉన్నారు. నిత్యమూ ఇజ్రాయెల్ గార్డుల హింసకు గురవుతున్న
వ్యాసాలు

సత్యంపై గురి: గాజాలో మహిళా జర్నలిస్టులపై దౌర్జన్యాలు 

 పాలస్తీనా మహిళా జర్నలిస్టులకు ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రాధాన్యత లేదు; వారు కఠిన ఘర్షణ వాస్తవాలను ఎదుర్కొంటున్నారు. కొనసాగుతున్న మానవతా సంక్షోభం మధ్య హింస, సామూహిక నిర్వాసిత్వం, వదలివేయబడటం వంటి తీవ్రమైన ప్రమాదాలతో వారు పోరాడుతున్నప్పుడు 8వ తేదీ వారికి ప్రాముఖ్యతలేని వేడుక అవుతుంది. తమ పనిలో వ్యక్తిగత ప్రమాదాలు ఉన్నప్పటికీ, ముందు వరుసలో నిలబడి ప్రతికూలతను తట్టుకు నిలబడేవారి  కథనాలను పంచుకోవడం, వారి బాధలకు సాక్ష్యమివ్వడం పైనే వారి దృష్టి ఉంటుంది. ముట్టడి - ప్రభావం ఏ యుద్ధంలోనైనా భయానక అనుభవాలు అనుభవించడం ఒక అసమానమైన పరీక్ష. ఏదేమైనా, ఆ యుద్ధ
కారా స్మృతిలో సాహిత్యం కవిత్వం

కథల తాతయ్య

గదిలో ఒకచోట ఖాళీ నిండిందిఆ వాలుకుర్చీని అల్లుకునిపాలపండ్ల చెట్టొకటి వుండేదికుర్చీ ముందువెనుకలకొన్ని ఆలోచనలు గాలిలో పూసిబహు నెమ్మది మాటలుగా వీచేవిచెవియొగ్గి వినాలి మనంజీవితాన్ని దున్నిన అనుభవాల పంటసేద్యం నేర్చినవాడు చెప్పిన కథ                o0oఅతను గడుసరి, అతను మనసరినిత్య చదువరిగంపెడు ప్రేమ, ఒకింత కోపం మెండుగా మొండితనంకూడికతో అతనొక పిల్లల కోడిమొక్కల్ని, పక్షుల్ని, మనుషుల్ని చేరదీసాడు.దొంగ ఏడుపుల్ని ఎండగట్టిఅసలు దుఃఖపడుతున్న వాళ్లచెక్కిళ్ళు తుడిచాడు                         o0oమక్కువతో చేరదీసిన అన్నిటిపైనాదిగులుపడే తాతతనం నిండినమనిషొకడుండేవాడు యిక్కడఎక్కడో సప్త సముద్రాల ఆవల వున్నవాళ్ళకుశలమూ ఆడిగేవాడుపిల్లలమీద, పుస్తకాల మీద మోహమున్నతొంభైయేడేళ్ల తాతడు మనతో ఇక్కడే వుండేవాడుయీ గుండెలో ఒకచోట శూన్యం నిండింది.                            o0oకనిపించడుగానీ అన్నీ గమనించేవాడుమన
వ్యాసాలు

విలువ‌ల ప్ర‌తినిధి

ఆర్‌కే తన జీవిత పర్యంతం నమ్మిన రాజకీయాల్లో కొనసాగాడు. చాలా  కష్టాలు అనుభ‌వించాడు. ఆదర్శప్రాయంగా నిలిచాడు.   వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న గురించి తెలియ‌ని వాళ్లు కూడా ఇలాంటివ‌న్నీ త‌ల‌చుకుంటున్నారు.  ఒకప్పుడు ఆయనతో పని చేసినవాళ్లు చాలా గౌరవంగా,  ఉద్వేగంగా  ఆర్‌కే వ్య‌క్తిత్వాన్ని  గుర్తు చేసుకుంటున్నారు.     త‌మ కాలంలో ఇలాంటి వాళ్లు జీవించి ఉండ‌టం   ఎవ‌రికైనా అపురూపమే.  ఆయ‌న రాజ‌కీయాల‌తో త‌మ‌కు  ఏకీభావం లేక‌పోయినా ఆయ‌న నిబ‌ద్ధ‌త గొప్ప‌ది అని నివాళి ప్ర‌క‌టిస్తున్న‌వాళ్లున్నారు.  వ్య‌క్తుల‌తో   రాజ‌కీయ విభేదాలు  ఎన్నో ఉంటాయి. కానీ రాజ‌కీయాల‌కు, భావ‌జాలాల‌కు అతీతంగా  మ‌నుషులు ప‌ర‌స్ప‌రం క‌నెక్ట్ అయ్యేవి అంత‌కంటే ఎక్కువ ఉంటాయి.     స‌మాజంతో విప్ల‌వోద్య‌మానికి  ఈ
కారా స్మృతిలో సాహిత్యం

కారా కథలు ఎందువల్ల నిలుస్తాయి?

వాచ్యంగా చెప్పిన దానికన్న ఎక్కువగా సూచనలు అందించిన కారా కథల గురించి గత నలబై ఏళ్లలో చాలా చర్చ జరిగింది, ఇంకెంతో చర్చ జరగవలసే ఉంది, జరగవచ్చు కూడా. కాగా మరణం తర్వాత కారా గురించి, కారా కథల వర్తమాన అన్వయం గురించి జరుగుతున్న చర్చ మరిన్ని కొత్త అంశాలను ముందుకు తెస్తున్నది. కారా కథల ప్రాసంగికత గురించి కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారాను, ఆ మాటకొస్తే ఏ రచయితనైనా ఎలా అర్థం చేసుకోవాలనే మౌలిక అంశాలు చర్చకు వస్తున్నాయి. కారా కథల్లో చెప్పిన, చెప్పదలచుకున్న విషయాల ద్వారా ఈ చర్చలోకి వెళ్లడం ఆసక్తికరంగా ఉంటుంది. మొదట ఒక
వ్యాసాలు

“గుండె చప్పుళ్ళు”

(ఇటీవల విడుదలయిన కథా సంపుటికి రచయిత రాసిన ముందుమాట ) తెలుగు సాహిత్యంలో ఈ "ఏకలవ్య కాలనీ" మొదటి ఎరుకల కథా సంపుటి. ఇవి మా జీవితాలు. ఇవి మా ఎరుకల కథలు. ఈ దేశపు మూలవాసీల్లో, ఆదివాసీల్లో ముఖ్యమైన ఎరుకల జీవనగాథలివి. ఈ కథల్లోని మా అవమానాలు, దుఃఖాలు, మా ఓటములు, గెలుపులు, మా కన్నీళ్ళు, నవ్వులు మిమ్మల్ని మా గురించి ఆలోచించమంటాయి. ఒక భరోసా కోసం ఒక ఆసరా కోసం ఒక నమ్మకం కోసం ఒక ధైర్యం కోసం ఎదురుచూస్తున్న ఎరుకల బ్రతుకుల్లో నిజమైన మార్పు కోసమే ఈ కథలు.. 1991లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో నా
వ్యాసాలు

దండకారణ్యంలో సైనిక దాడులు

(మార్చి 31న రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసంఘాల కార్యకర్తల ఇండ్ల మీద ఎన్ఐఏ దాడులు మొదలుకావడానికి కొన్ని గంటల ముందు రాసిన వ్యాసం.. అముద్రితం- సంపాదకుడు) కళ్ల ముందరి సత్యం  తెలుపు న‌లుపుల్లో క‌నిపిస్తుంద‌న్న గ్యారెంటీ ఏమీ లేదు. అది మ‌న చుట్టూ క్రీనీడల్లో కనిపించకుండాపోవచ్చు. ఈ సమస్యను తప్పించుకోడానికి పదునైన చూపు ఉండాలనుకుంటాం. కానీ న్యాయా న్యాయాలపట్ల మన వైఖరులతో, విలువలతోసంబంధం లేకుండా మన చూపు పదునెక్కబోదు. చుట్టూ ఉన్న సంక్షోభాలను, పోరాటాలను అర్థం చేసుకోవడంలో ఈ పరిమితిని  అధిగమించగలమా? లేదా? అనేదే ప్రశ్న.దేనికంటే మనుషుల్లోని సకల ఉత్తేజాలను పాలకవర్గం నిరంతరం కొల్లగొడుతూ ఉంటుంది. దానికి ఒక
వ్యాసాలు

రాజ్యాంగం – హక్కులు

(రాజ్యాంగవాదం గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో పాఠకుల అవగాహన కోసం ఈ వ్యాసాన్ని పునర్ముద్రిస్తున్నాం. పౌరహక్కుల ఉద్యమ నాయకుడు, న్యాయశాస్త్ర ఆచార్యుడు ప్రొ. శేషయ్య 2008వ సంవత్సరంలో ప్రొద్దుటూరులో ప్రైవేట్‌ టీచర్స్‌ అండ్‌ లెక్చరర్స్‌ యూనియన్‌ మిత్రుల కోసం చెప్పిన పాఠం ఇది. ఈ వ్యాసం ఆయన మరణానంతరం పౌరహక్కుల సంఘం ప్రచురిస్తున్న ప్రొ. శేషయ్య రచనా సర్వస్వం-1లో అచ్చయింది) రాజ్యాంగం ప్రాథమికంగా అధికారం గురించి మాట్లాడుతుంది. మన భారతదేశంలో అధ్యక్ష తరహా పాలన కాకుండా పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పార్లమెంటులోని రెండు సభలు, రాష్ట్రపతి కలిపి ఒక నిర్మాణం వుంటుంది. అది పని చేయాలంటే