ఆర్ధికం

నిప్పుల కొలిమిగా యూరప్

ఇవాళ యూరప్ నిప్పుల కొలిమిగా మారింది. చరిత్రలోనే అత్యంత తీవ్రమైన, సుదీర్ఘమైన హీట్‌వేవ్  (వడగాల్పులు) కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నది. కార్బన్ కాలుష్యం కారణంగా మరింత కోరలు చాచిన ఈ వేడి..  ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ప్రజలను కష్టాల పాలు  చేస్తున్నది. ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత వేడి రాత్రిని నమోదు చేయగా..,  బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశాలు జూన్ నెలలో ఆల్-టైమ్ రికార్డు ఉష్ణోగ్రతలు చ‌వి చూశాయి. ఎండ వేడికి పలుచోట్ల కాంక్రీట్ స్లాబ్‌లు పగుళ్లు పడుతున్నాయి. రైల్వే పట్టాలు క‌రిగిపోయి దెబ్బతినడం.. రోడ్లు బీటలు బారడంతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. ఎండలతో యూరప్ దేశాలలో 6000  మందికి పైగా
ఆర్ధికం

అప్పుల ఊబిలో భారత ఆర్థిక వ్యవస్థ

ప్రభుత్వం రుణంతో అవసరమైన మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం ద్వారా వృద్ధిని ఉత్తేజ పరిచి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోతాన‌ని చెప్తుంది. కాని ప్ర‌భుత్వాలు చేస్తున్న‌ అధిక రుణాలు ప్రైవేట్ పెట్టుబడులను తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని పెంచడం, భవిష్యత్ తరాలపై అధిక పన్నుల భారాన్ని మోపడం వంటి ప్రమాదాలను కలిగి ఉంటాయి. దీని మొత్తం ప్రభావం రుణ-జిడిపి నిష్పత్తి, ఖర్చు ఉద్దేశ్యం, వడ్డీరేట్లపై ఆధారపడి ఉంటుంది.  తాజా గణాంకాల ప్రకారం మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల మొత్తం అప్పు 2026 ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో సుమారు 81 శాతంగా ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభు త్వాల వాటా గణనీయమైనది.
ఆర్ధికం

భారత్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం

పది రోజుల్లో నాలుగుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి! ఇది యాధృచ్ఛికం కాదు. విధానపర మైన నిర్లక్ష్యం దౌర్బ‌ల్యం. అంత‌కు మించి ఆర్థిక నిర్వహణలో వైఫల్యం. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధ‌రలు తగ్గినా, ఆ లాభం వినియోగదారుడికి చేరట్లేదు. పెరిగితే మాత్రం వెంటనే ప్ర‌జ‌ల‌పై భారం మోపబ డుతున్న‌ది. ఇది మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానం. దాంతో రోజు రోజుకు తీవ్రతరం అవుతు న్న సంక్షోభ కారుమేఘాలు దేశ గగనతలంపై కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే నిరుద్యోగం విజృంభించి, వేత నాల ప్రతిష్టంభన ఏర్ప‌డింది. ఈ జంట సంక్షోభాలు ఉండగా అదనంగా యుద్ధం వల్ల ధరల పెరుగు దల  హడలగొడుతున్నాయి.  కొంత
ఆర్ధికం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అక్రమ యుద్ధం చేస్తున్నాయి. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక పునాదులను కదిలించేలా మారుతోంది. దేశ దేశాలు గ‌డ్డు ఆర్థిక ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాయి. ఈ నేప‌థ్యం.. గెలుపు ఓటమిలతో నిమిత్తం లేకుండా యుద్ధంలో పాల్గొనే దేశాలన్నీ వినాశకరమైన పరిణామా లను ఎదుర్కోవాల్సిందే అన్న సత్యాన్ని మరోసారి రుజువు చేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో ఆ దేశాల్లో మౌలిక సదుపాయాలు ద్వంసమై, పర్యావరణం దెబ్బతిని, ఆ దేశాల అబివృద్ధి దశాబ్ధాల వెనుక‌కు వెళ్లిపోయింది. ఇరాన్‌లోని విస్తారమైన చమురు వనరులను స్వాదీనం చేసుకోవాలనే దురాశతో ఉన్న అమెరికా పెట్టుబడిదారీ వర్గం అనుకూల సమయం
ఆర్ధికం

అసమానతల భారత్‌లో పెరుగుతున్న బిలియనీర్లు

దేశంలో సంపదల అసమానత విపరీతంగా పెరుగుతున్నదని, సంపదల పున:పంపిణీ జరగకపోతే సామాజిక సంక్షోభానికి దారితీస్తుందని అనేక మంది చెబుతున్నారు. కొంత మంది దగ్గరే అపార సంపద పోగుపడితే  మొదటికే మోసం వస్తుందన్నది వారి ఉద్దేశ్యం. “2026 ప్రపంచ అసమానతల నివేదిక” 2025 డిసెంబర్ లో విడుదలైంది. ప్రపంచ అసమానతల నివేదిక : ప్రపంచ అసమానతల సమాచార సంస్థకు అనుబంధంగా ఉన్న రెండు వందల మందికి పైగా పరిశోధకులు అనేక కోణాల్లో చేసిన విశ్లేషణల సారమే ప్రపంచ అసమానతల నివేదిక , అన్ని అంశాలను ఇక్కడ సృజించటం సాధ్యం కాదు గనుక సంపదల పున:పంపిణీ గురించి చర్చిద్దాం. ప్రపంచాన్ని “కమ్యూనిస్టు
ఆర్ధికం

సవాళ్లను గుర్తించని ఆర్థిక వ్యవస్థ

మోడీ పాలనలో దేశమంతా ఆగమాగంగా తయారయ్యింది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వృద్ధిరేటు గాడితప్పింది. డాలర్‌తో పోలిస్తే, రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ చూడని కనిష్ఠ స్థాయికి పతనమయ్యింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లక్షల కంపెనీలు మూతబడ్డాయి. ఉద్యోగాలు లేక యువత తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొరంటున్న ప్రధాన సవాలు పేదరికం. దాదాపు 28 శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. దీనివల్ల  జనాభాలో ఎక్కువ భాగం ఆర్థిక వ్యవస్థలో పాల్గొనలేకపోతున్నారు. ఇది పేదరికం యొక్క విష వలయానికి దారితీస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న మరో పెద్ద
ఆర్ధికం

ఆర్థిక అసమానతలో అగ్రస్థానం భారత్‌దే!

ప్రపంచ అసమానతల నివేదిక 2026 మూడవదిగా వెలువడుతున్నది. 2018, 2022 తర్వాత కీలకమైన సిరీస్‌గా ఇది వస్తున్నది. ప్రపంచవ్యాపితంగా రెండువందల మందికి పైగా మేధావుల కృషి ఆధారంగా ఇది కూర్పు చేయబడింది. వారు ప్రపంచ అసమానతల అధ్యయన ప్రయోగశాలతో అనుబంధంగా ఉంటున్నారు. ప్రపంచ అసమానతల చారిత్రక పెరుగుదలకు సంబంధించిన అతి పెద్ద డేటా సేకరణకు వారు దోహదపడుతున్నారు. అసమానతలకు సంబంధించి ప్రపంచవ్యాపిత చర్చలకు ఈ సమిష్టి కృషి గొప్పగా సహాయపడగలదు. విధాన నిర్ణేతలు, పౌరులు, అసమానతల తీవ్రతనూ, కారణాలనూ అర్థం చేసుకునే తీరును మార్పు చేయడానికి ఈ బృందం కృషి సహాయ పడింది. అమెరికా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాల కన్నా
ఆర్ధికం

ప్రభుత్వ బ్యాంకుల మెడపై ప్రైవేట్‌ కత్తి

దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకులను పెద్దపెద్ద కంపెనీలు నిలువునా ముంచేస్తున్నాయి. మొండిబకాయిలు లేదా నిరర్థక ఆస్తులు (నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్స్‌/ఎన్‌పిఎ).. పేర్లు ఏవైనా, లాభపడుతున్నది ఎగవేత కంపెనీలు.. నష్టపోతున్నది ప్రత్యక్షంగా బ్యాంకులు, పరోక్షంగా ప్రజలు. ఘరానా కంపెనీలు బ్యాంకులను ముంచకపోతే, ఈ బ్యాంకుల లాభాలు మరింతగా పెరిగి ఉండేవి. పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీలు రుణాలను ఎగవేయడమే బ్యాంకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ప్రభుత్వం దర్జాగా మొండిబాకీలను రద్దు చేస్తోంది. ఇలాంటి రుణాలను రద్దు చేయడం కంటే, వసూలు చేయాల్సిన అవసరం ఉందని ఎఐబిఇఎ చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోకపోగా, మరింతగా రాయితీలను
ఆర్ధికం

డాలర్ ఆధిపత్యానికి తెరపడనుందా ?

ప్రపంచ కరెన్సీలు అన్నింటిలో ఇప్పటి వరకూ డాలర్ది రారాజు పాత్ర కావడం వెనుక ఉన్నది ఆ డాలర్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ తాలూకు 'బలం' అన్నది నిజం! రెండవ ప్రపంచ యుద్ధం ముగియనున్న కాలానికి రవి అస్తమించని సామ్రాజ్యం కలిగి యున్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కకావికలమైంది. అప్పటిదాకా అంతర్జాతీయ వాణిజ్యంలో ఆధిపత్యం చలాయించిన బ్రిటన్, తదితర పశ్చిమ యూరప్ దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. బ్రిటిష్ కరెన్సీ పౌండ్తో పాటు ఐరోపాలోని ఇతర పశ్చిమ దేశాల కరెన్సీల విలువ కూడా క్షిణించింది. రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ చెక్కుచెదరకుండా నిలిచింది అమెరికా ఒక్కటే. ఆ దేశం దగ్గర
ఆర్ధికం

కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. మనుషులు పెట్టుబడి చదరంగంలో పావులుగా ఉపయోగించబడుతున్న సందర్భంలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా వృద్ధి సాధిస్తోందని.. ఇది మాములు విషయం కాదని ఇటీవల ప్రధాని మోడీ ఘనంగా ప్రకటించారు. ఇదే నిజమైతే భారత ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఎందుకు నెలకొని ఉందని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో నిరుద్యోగం, పేదరికం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని మూడీస్‌, స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌, ఫిచ్‌ వంటి రేటింగ్‌ సంస్థలు, నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌(ఎన్‌ఎస్‌ఓ) ఘోషిస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థ(ఐయంఎఫ్‌) 2023-24 వృద్ధి అంచనాను అంతకుముందున్న 6.1 శాతం