వ్యాసాలు

మహిళా సాహిత్య చరిత్రలో శోభారాణి

జీవితంలో తాను ఒక్కతే శిఖరంలా ఎదగడం కాదు, ఒక అరణ్యంలా మనుషుల మధ్య స్వచ్ఛమైన ఉపిరి కోసం విస్తరించాలని భావించిన  మనస్తత్వం డా.కందాల శోభారాణిది. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలోని కందాల అనసూర్య, రామచంద్రయ్య దంపతులకు మూడవ సంతానంగా జన్మించారు. మధ్యతరగతి శ్రామిక జీవితంలోని కష్టాలను, కన్నీళ్లను పక్కకు నెట్టేసి విద్యపై ఆసక్తితో ముందుకు సాగింది. బాల్యం నుండే మూఢవిశ్వాసాలను వ్యతిరేకించేది. స్వతంత్రమైన భావాలతో ఇతరులకు భిన్నంగా ఆలోచించడం ఆమె ప్రత్యేకత. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పిడిఎస్‌యు మాజీ అధ్యక్షుడు తాటిపాముల రమేష్‌ను ఆగస్టు 9, 2002న ఆదర్శ వివాహం చేసుకొన్నారు. ఇక్కడి నుంచే ఆమె జీవితం
వ్యాసాలు

మహారాష్ట్రలో ముస్లింలకు న్యాయం ఎండమావియేనా?

గడిచిన జూలై నెలలో బొంబాయి హైకోర్టు, స్పెషల్‌ సెషన్స్‌ కోర్టు రెండు బాంబు పేలుళ్ల కేసుల్లో రెండు ఆసక్తి దాయకమైన తీర్పులు ఇచ్చాయి. రెండిరట్లోనూ ప్రాసిక్యూషన్‌ ముద్దాయిలు నేరం చేశారని నిరూపించలేకపోవడం వల్ల నిర్దోషులుగా విడుదలయ్యారు. మొదటిది 7/11 వరుసగా రైళ్లలో బాంబులు పేలిన కేసు. అందులో 189 మంది చనిపోయారు. వందలాదిమంది గాయపడ్డారు. అది 2006 జూలై 11న జరిగింది. ఏ.టి.ఎస్‌. గా పిలిచే యాంటి టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ ఈ కేసులో విచారణ చేపట్టింది. 19 సంవత్సరాలు హైకోర్టు తీర్పు వచ్చేవరకు ఇందులో ఒకరు 2017 లోనే నిర్దోషిగా విడుదలై మిగతా 12 మంది మహారాష్ట్రలో పూనే,
వ్యాసాలు సంభాషణ

మానని గాయమూ, తీరని ఆగ్రహమూ వాకపల్లి..

‌ (వాకపల్లి మహిళల కు  న్యాయం జరిగిందా ?  ఆదివాసులకు, అందునా ఆదివాసీ మహిళ లకు న్యాయం చేసే వ్యవస్థలోనే మనం ఉన్నామా? కోర్టు తీర్పు నేపథ్యంలో విరసం . ఆర్గ్ జూన్ 1 , 2016 లో గతంలో అచ్చయిన ఈ వ్యాసం పాఠకుల కోసం.. - వసంతమేఘం టీం ) విశాఖపట్నం దగ్గర కరకవానిపాలెంలో అమరుడు కామ్రేడ్‌ అజాద్‌ ‌సంస్మరణ సభ భావోద్వేగాలతో జరుగుతున్నది. ఆ సమయంలో నా పక్కన కూర్చున్న లాయర్‌ ‌బాలక్రిష్ణ ‘వాకపల్లి వెళుతున్నాం వస్తారా?’ అని అడిగాడు. ఛిద్రమైపోతున్న ప్రజల జీవితం గురించి దాదాపుగా రెండు గంటలుగా ఆ సభ జరుగుతున్నది.
వ్యాసాలు సంభాషణ

అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

(డానియల్ అడుగుతున్నాడు.. మా ఊరి మహిళకు న్యాయం జరిగిందా? అని. న్యాయం అంటే ఏమిటని అమరుడు డానియల్ మనలను నిలదీస్తున్నాడు.. ఈ రోజు ఆయన కూడా లేకపోవచ్చు..    బాధిత మహిళల్లో కొందరు మరణించి ఉండవచ్చు..  కానీ వాళ్ళ కన్నీరు, దుఃఖం , నెత్తురు, అమరత్వం  మనలను నిలదీయడం లేదా? న్యాయం అంటే ఏమిటో చెప్పమని ..18.11.2016 (virasam.org లో ప్రచురి తమైన ఈ వ్యాసం పాఠకుల కోసం.. వసంత మేఘం టీం) విశాఖ ఏజెన్సీలో విస్తరించి ఉన్న 2వేల ఎకరాల చింతపల్లి అడవులను దుబాయికి చెందిన ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చేందుకు 1999లో అప్పటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి
వ్యాసాలు

గాడ్లింగ్ కేసులో తీర్పుగా మారుతున్న వాయిదా

సురేంద్ర గాడ్లింగ్ బెయిల్ దరఖాస్తు సుప్రీంకోర్టులో కాఫ్కేస్క్ ఫైల్‌గా (సర్రియల్-అధివాస్తవికత- ఒక పీడకల అనుకోవచ్చు. కాఫ్కేస్క్ అనేది ఫ్రాంజ్ కాఫ్కా అనే ప్రసిద్ధ రచయిత ఇంటిపేరు నుండి వచ్చింది, అతను సర్రియలిజం, దిక్కుతోచని పాత్రలతో కూడిన కథలకు ప్రసిద్ధి) ఇది కనిపిస్తుంది, కానీ మాయమైపోవడానికే కాజ్‌ లిస్ట్‌ లోకి వస్తుంది. (కోర్టులో ప్రతిరోజూ వచ్చే కేసుల జాబితా). వాయిదా వేయడానికే ప్రస్తావిస్తారు. ఈ కేసును చేసే  న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, విచారణ జరపకపోవడం అనే చర్యను తీర్పు రూపంలోకి మార్చారు. 2023 ఆగస్టు లో బెయిల్ పిటిషన్ మొదటిసారి దాఖలు చేసినప్పటి నుండి 17 సార్లు జాబితా
వ్యాసాలు

కార్పొరేటీకరణ, సైనికీకరణ – హక్కుల ఉల్లంఘన 

మన దేశంలో హవాయి చెప్పులు వేసుకునే వారు సహితం విమానాలలో ప్రయాణించే స్థితిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్పించిందని ఈ రోజు పత్రికలలో ఒక వార్త వచ్చింది. అదేమేరకు నిజమో మీకూ, నాకూ అందరికీ తెలుసు. విమాన ప్రయాణం మాటేమోగాని తమపై కేంద్ర ప్రభుత్వం వైమానిక దాడులు చేస్తున్నదని, వాటిని ఆపమని ఆదివాసులు డిమాండ్‌ చేస్తున్నారు. . మనందరం దీన్ని పట్టించుకోవాలి. వాళ్లతో గొంతెత్తి అరవాలి. ఇదీ ఇవ్వాల్టి పరిస్థితి. ఛత్తీస్‌ఘడ్‌ రాష్త్రం బీజాపూర్‌ జిల్లాలో ఫిబ్రవరి 1, 2 వ తేదీలలో జరిగిన ఘటనను మీకు వివరిస్తాను. ఈ ఘటన చెబితే దీని ద్వారా
వ్యాసాలు

యువరాజు పాలనలో  విద్యాశాఖ  దుస్థితి

 కూటమి ప్రభుత్వ యువరాజు నారా లోకేష్ గారు విద్యాశాఖ బాధ్యతలు చేపట్టడంతో ఆంధ్ర ప్రదేశ్ విద్యా రంగంలో చాలా మార్పులు జరుగుతాయని, ఉపాధ్యాయుల సర్వీస్ పరమైన సమస్యలుపరిష్కరింపబడతాయని, విద్యాభిమానులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు అంతా ఆశించారు. కానీ గత 15 నెలల కాలంలో యువరాజు గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అత్యంత ప్రతిష్టంభనకు గురి కావడం జరిగింది. గత వైసిపి ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో 117 విషయంలో విద్యావేత్తలు, ఉపాధ్యాయులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగింది.కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం దానిని రద్దు చేయకుండానే,దాని సవరణల పేరుతో జీవో  20, 21 లను తీసుకొచ్చి ఆరు రకాల
వ్యాసాలు

నిబద్ధ విమర్శకుడు కెవిఆర్

కెవిఆర్‍గా నిలిచి పోగోరిన కనుపూరు వెంకట రమణారెడ్డి కవి, విమర్శకుడు, నాటక కర్త, విరసం వ్యవస్థాపక కార్యదర్శి, పత్రికా సంపాదకుడు, అధ్యాపకుడు. మార్క్సిస్టు దృక్పద భూమికతో ఒక రచనను రచయితని అంచనా వేసే పద్ధతికి కె.వి.ఆర్ రచనలన్నీ తార్కానాలుగా నిలుస్తాయి . తెలుగులో వ్యాసం రాసినా, గ్రంథం రాసి నా, ఒక రచన వెలువడిన కాలం దాని ముందు వెనుకలు, సామాజిక ఆర్థిక రాజకీయ సాహిత్య పరిణామాలు, రచయిత దృక్పథం ,సాహిత్య తత్వం వంటి అంశాలతో ముడిపెట్టి సమగ్ర దృష్టితో విమర్శ చేసిన వారు కెవిఆర్. మహోదయం, కవి కోకిల, జగన్నాథ రథచక్రాలు, ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర వంటివి
వ్యాసాలు

…not just the future, the present too

(Speech at Virasam Foundation Day Conference - July 2025. Edited for better clarity.) Comrades, I thank the organisers of this conference, the comrades of Virasam, for giving me this opportunity to come and be with you and talk about this topic. Essentially, it relates to the tremendous repression being faced by the revolutionary movement today. The huge losses it has sustained and whether that calls for any review or change
వ్యాసాలు

వెచ్చఘాట్ లో సగం ఆకాశం

ఈ తరం మహిళలు నిర్మిస్తున్న పోరాట గాథ ఇది కొత్త తరం పోరాటాల యుగం.  సాంప్రదాయక విలువలను, దోపిడీ వ్యవస్థలను ప్రశ్నిస్తూ మహిళలు పోరాటాల్లోకి వస్తున్నారు. తద్వారా పోరాటాలు కూడా కొత్తదనాన్ని సంతరించుకుంటున్నాయి. ఇందులో వెచ్చ ఘాట్ పోరాటం ఒకటి. ‌‌బహుళజాతి కంపెనీల, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఛత్తీస్ ఘడ్ లోని కాంకేర్  జిల్లాలోని చిత్రం, వెచ్చఘాట్, కాంధాడిల్లో బిఎస్.ఎఫ్ క్యాంపుల నిర్మాణం, పరాల్‌కోటని పర్యాటక కేంద్రంగా మార్చాలని, కోత్రి నది మీద వంతెన నిర్మాణం, మర్రొడ నుండి రోడ్డు నిర్మాణం చేయాలని ఆదివాసులు చాలా కాలంగా పోరాడుతున్నారు.   ఈ పథకాల  వల్ల ఆదివాసీ-మూలవాసీ