సాహిత్యం వ్యాసాలు

చింతామణిపై నిషేధం చెల్లేనా?

సుమారు వందేళ్ల కిందటి(1923) ‘జనరంజక’ చింతామణి నాటకాన్ని ఆంధ్రపద్రేశ్‌ ప్రభుత్వం నిన్న(17.1.2022) నిషేధించింది. కొద్ది రోజుల కింద ఆర్య వైశ్య సంఘం వాళ్లు ఈ నాటకం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నదని, నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  వాళ్ల కోరిక మీదకు ప్రభుత్వం నిషేధించింది. కానీ నిషేధానికి కారణాలు చెప్పలేదు.   కాళ్లకూరి నారాయణరావు రాసిన ఈ నాటకాన్ని కాకినాడలోని సుజనరంజనీ ప్రెస్‌ తొలిసారి అచ్చేసింది. ఆ తర్వాత అనేకసార్లు పునర్ముద్రణ అయింది. బహుశా లక్షల కాపీలు ఐదు తరాల పాఠకుల దగ్గరికి చేరి ఉంటాయి. వేలాది ప్రభుత్వ గ్రంథాలయాల్లో చోటు సంపాదించుకొని ఉంటాయి. సొంత గ్రంథాలయాల్లో భాగమై
వ్యాసాలు

ఆదర్శమే అందం నిత్య నిర్వచనం  

స్త్రీ అంటే శరీరం కాదు అనుభవించే హృదయం, ఆలోచించే మెదడు ఉన్న మానవజీవి అని నమ్మే  వ్యక్తుల, సంస్థల తీవ్ర  నిరసనల మధ్య మరే ప్రజోపయోగ కార్యక్రమాలు లేవన్నట్లు తెలంగాణ ప్రభుత్వం  హైద్రాబాద్ లో ఈ ఏడాది మే7 నుండి  72వ ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించ తల పెట్టింది. దీనిని తెలంగాణకు ఆదాయం తెచ్చిపెట్టగల ఉత్సవంగా చూస్తూ 200కోట్ల పెట్టుబడి పెట్టటానికి సిద్ధం అయింది. ఈ సందర్భంలో అందం గురించిన, శాస్త్రీయమైన , మానవీయమైన అవగహన కోసం  నిత్య వ్రాసిన “అందం - ఆదర్శం”  అనే కవితను పరిచయం చేయాలనిపించింది.  నిత్య కలం పేరు. తల్లిదండ్రులు పెట్టిన
వ్యాసాలు

భారతదేశంలో రాజకీయ ఖైదీలు: రాజ్య కుట్రపూరిత వ్యాజ్యాలు, ఏజెన్సీలు

5 మార్చి 2024న, బొంబాయి హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహి, విజయ్ టిర్కీ, మహేష్ టిర్కీలను వారిపై ఉన్న అన్ని అభియోగాల నుండి నిర్దోషులుగా ప్రకటించింది. కేవలం 33 ఏళ్ల పాండు నరోటే జైలులో ఉండగానే మరణించాడు. నిజానికి ఇది కస్టడీ హత్య అని, సంబంధిత అధికారులపై విచారణ జరిపి శిక్షించాలన్నారు. ఎంతటి క్రూరత్వం అంటే.. అతను అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కూడా జైలు పాలకవర్గం అతనికి వైద్యం చేయించలేదు. అతని జీవితపు చివరి రోజుల్లో కళ్ళ నుండి, మూత్రంలో రక్తస్రావం జరిగింది. మిగిలిన ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు
వ్యాసాలు

14 సంవత్సరాల తరువాత నిర్దోషులుగా తీర్పు

14 సంవత్సరాల 19 రోజుల తరువాత ప్రశాంత్ రాహి, చంద్రకళ తదితరులను ఉత్తరాఖండ్  కోర్టు UAPA కేసులో నిర్దోషులుగా ప్రకటించింది  2022 జనవరి 7న, ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌లోని జిల్లా- సెషన్స్ జడ్జి ప్రేమ్ సింగ్ ఖిమల్ కోర్టు, దేశద్రోహం, రాజద్రోహం, UAPA నిందితులు ప్రశాంత్ రాహి, అతని జీవన సహచరి చంద్రకళతో పాటు మరో ఇద్దరిని నిరోషులుగా ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లో 14 సంవత్సరాల 19 రోజుల పాటు సాగిన ఈ ప్రసిద్ధ కేసులో అనేక కోణాలు వున్నాయి. 2007 డిసెంబర్ 17 న డెహ్రాడూన్‌లోని ఆరాఘర్ దగ్గర ప్రశాంత్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు
వ్యాసాలు

సంస్కృతి – మార్క్సిస్టు సాంస్కృతిక సిద్ధాంతం

(విర‌సం 28వ మ‌హాస‌భ‌ల కీనోట్ పేప‌ర్‌లోని కొన్ని భాగాలు పాఠ‌కుల కోసం- వ‌సంత‌మేఘం టీం) సంస్కృతి ఉత్పత్తి :   సాహిత్యం, కళలలాగే సంస్కృతి సామాజిక ఉత్పత్తి.  సంస్కృతిలో నుంచే  కళలు, సాహిత్యం పుట్టుకొస్తాయి. సామాజిక ప్రపంచంలో మనిషి ఆవిర్భవించినట్లే సామాజిక సంబంధాల నుంచి సంస్కృతి రూపొందుతుంది.  అన్ని సామాజిక అంశాలకంటే ఎక్కువగా  సంస్కృతి  మనిషిని  పెనవేసుకొని ఉంటుంది.  సంస్కృతి మానవ భౌతిక జీవితావరణకు సంబంధించిందే కాదు. మానవ మనో ప్రపంచంలోనూ ఉంటుంది. మనిషి ప్రవర్తనలో, ఆలోచనా రీతుల్లోనే ఉంటుంది.  సంస్కృతి తనకు తగినట్లు మనుషుల మనో ప్రపంచాన్ని డిజైన్‌్‌ చేసుకుంటుంది. అది భౌతిక ప్రపంచంలో వలె మనస్సులో  కూడా
వ్యాసాలు

హిమాలయోన్నత అమరత్వం నంబాళ కేశవరావుది.

పీడిత ప్రజలకు కలలు కూడా ఉండకపోవచ్చు. వాళ్లు అనుభవిస్తున్న అమానవీయమైన అణిచివేత, హింస, దోపిడీ నుంచి వాళ్లకు కన్నీళ్లు కార్చే సమయమూ, అవకాశమూ ఉండకపోవచ్చు. దోపిడీ సమాజం ఆ ప్రజల దేహాలను, మనసులను పిండి పిప్పి చేస్తుంటే వాళ్ల నెత్తురు చెమటయి కారడమో, చిత్రహింసలతో నెత్తురై కారడమో తప్ప ఎండిపోయిన కళ్ళల్లో నుంచి కూడా కన్నీళ్లు కారే అవకాశం లేకపోవచ్చు. గొంతులో తడి మిగిలితే కదా గాద్గదికంగా దుఃఖించడానికి. కానీ ఇవ్వాల్టి సమస్య కాదు. స్పార్టకస్‍ కాలానికి పీడితులైన, దోపిడీకి గురైన బానిసలకు మొదటిసారి తాము బానిసలుగా చూడబడుతున్న మనుషులమని తెలిసి వచ్చింది. ఆ తెలిసి రావడం కన్నా
ఓపన్ పేజ్

ఈ  ‘తెలుగుదనం’  దేనికి?

కొన్ని ‘ఆలోచనలు’ భలే ఉంటాయి. దేనికి ముందుకు వస్తాయోగాని, అసలు విషయాలను బైటపెడతాయి. కె. శ్రీనివాస్‌ ఆగస్టు 15 ఆంధ్రజ్యోతిలో రాసిన ‘‘మరీ ఇంత ‘కళ’ తప్పిందేమిటి తెలుగుదనం?’’ అనే వ్యాసం అట్లాంటిది. కాకపోతే  తెలుగు కళా సాహిత్య సాంస్కృతిక రంగాల గురించి వీలైనంత వెనక్కి వెళ్లి   పాత విషయాలే మళ్లీ మాట్లాడుకోవాల్సి వస్తున్నది. ఈ మధ్య తెలుగు ప్రగతిశీల సాహిత్య మేధో రంగాల మీద విమర్శనాత్మక పున:పరిశీలన పెరుగుతున్నది. ఇది చాలా అవసరం. ఎక్కడ బయల్దేరాం? ఎట్లా ప్రయాణిస్తున్నాం? దీని గురించి మన అంచనాలేమిటి? అని తరచి చూసుకోవడం మంచిది. ఒకప్పటి కంటే కాస్త ఎక్కువగా చుట్టుపక్కల
వ్యాసాలు

ప్రజా యుద్ధ సేనాని 

తూచడానికి, కొలవడానికి కొందరు సిద్ధమవుతారు. గొంతులు పిక్కటిల్లేలా రోదించేవారు కచ్చితంగా చాలా మందే ఉంటారు. ఎందుకిలా జరుగుతున్నదో ఒకసారి తరచి చూసుకోమని మైత్రీ పూర్వక సూచనలిచ్చేవాళ్లూ ఉంటారు. బహుశా ఎంతో కొంత దు:ఖపుతడి సోకని వాళ్లెవరుంటారు?  అలాంటి సందర్భం మరి. ఎంత అద్భుత జీవితం! ఆయన చుట్టూ చేరి గభాల్న ఏదో ఒక మాట అనడం, రాయడం సాధ్యమయ్యేదేనా?   చనిపోయింది వ్యక్తిమాత్రుడు అయితే గుణగానం చేసి సర్ది చెప్పుకోవచ్చు  ఇది ముగింపు అయితే ఇంకేమీ లేదని నిరాశతో సరిపెట్టుకోవచ్చు. మావోయిస్టుపార్టీ కేంద్ర కార్యదర్శి అంటే అర్ధ శతాబ్దానికి పైగా ఈ దేశ ప్రజలు గడించిన   పోరాట అనుభవం. వాళ్ల ఆచరణలో
సాహిత్యం వ్యాసాలు

నక్సల్బరీ కవితా విస్ఫోటనం అలిశెట్టి

అలిశెట్టి ప్రభాకర్ ను సామాజిక సంక్షోభం వున్నచోట వుండనీయలేదు. ఆ కల్లోల సమాజంలోని తుఫాను ఆయన జీవితంలో భీభత్సాన్ని సృష్టించింది. సృష్టించబడుతున్న కల్లోలాలకు కారణాలు వెదుక్కున్నాడు. ఆ కారణాలు, ఆవేశం, నిరసన కవితాత్మకమైంది. కవిత్వం రాయడానికి గొప్పగా చదువుకొనోక్కరలేదని నిరూపించాడు. స్పందించే గుణముంటే చాలు. ఆ స్పందనను ఒక క్రమంలో పేర్చుకునే నేర్పు స్పందించే గుణమే అందిస్తుంది. ఆ క్రమమే అలిశెట్టి. ఆదే ఆయన కవితాగుణం. అణచివేత, సంక్షోభాలకు కారణాలను శాస్త్రీయంగా అంచనా వేసుకోవడానికి విరసం అలిశెట్టికి చేయూత నిచ్చింది. ఆ శాస్త్రీయపు అంచనాలతో సామాజిక కుళ్ళును, కౌటిల్యాన్ని తూర్పారబట్టాడు. అట్లని నిందించడడమే పనిగా పెట్టుకోలేదు. ప్రత్యామ్నాయ మార్గాల్ని
సాహిత్యం వ్యాసాలు

నైతిక , మత , వ్యంగ్యాత్మకాలు

(1829లో వేమన పద్యాల కూర్పుకు బ్రౌన్‌ రాసిన ఇంగ్లీషు ముందుమాట)  తెలుగు: సిఎస్‌ఆర్‌ ప్రసాద్‌ ఏదైనా ఒక భాషను అధ్యయనం చేయాలని అనుకున్నప్పుడు మనం సహజంగానే దేశీయులలో ప్రజాదరణపొందిన పుస్తకాలను గురించి తెలుసుకోవాలని అశిస్తాం. ఆ పుస్తకాలు సరళమైన శైలిలో వుండి విదేశీయులు కూడా తేలికగా అర్థం చేసుకునేటట్లు వుండాలని అనుకుంటాం. తెలుగుకు సంబంధించి 1824లో ఇలాంటి పరిశోధన ప్రారంభించాను. ఆ సందర్భంగా ఈ పుస్తకంలో ప్రచురించిన పద్యాలతో నాకు పరిచయం కలిగింది. ‘వేమ’ లేదా ‘వేమన’ (రెండు పేర్లూ వాడుకలో వుండేవి) రచించిన అనేకమైన రాత ప్రతులు నాకు లభ్యమయ్యాయి. నేను వాటిని చదివి నా ఉద్యోగబాధ్యతల్లో