హస్బెండ్ స్టిచ్ - 3

‘’ ఆజో మ తోన బేటా దూన్చు ‘’ !

’అయ్యో నేను వస్తున్నా .. ఆమె నా బెహెన్ సార్ .. మా చాంద్  బాయి , ఆడనె  ఉంచుండ్రి  ఇగో  ఐదు  నిమిషాల్లో ఇప్పుడే వస్తున్న” భూక్యా ఖంగారుగా అంటూ .. భార్య పద్మ తో “చాంద్  బాయి  జ్యోతి నగర్ లో ఒకల యింట్ల  ఉన్నదంట  నేన్  పోయి తొలుకొని వస్తా” అన్నాడు . “ నేను గూడ వస్తా పా “ అన్నది పద్మ .   చాంద్ బాయి ., భూక్యా చెల్లెలు.                                                             **** “ఆజో ., మ తోన బేటా దూన్చు”.,{ నాతో రా నీకో కొడుకుని ఇస్తా }
కథలు

పేగుబంధం

'కన్న కొడుకునే చంపేందుకు ఎందుకు తెగబడ్డావు?' గురిపెట్టిన తుపాకీలా తన కళ్లలోకే చూస్తున్నపోలీసు అధికారి ముఖం మిట్ట మధ్యాహ్నం సూర్యుడిలా భగభగమండిపోతోంది. మండే సూర్యుడి దిక్కు నిలువలేక వాడిన గడ్డిపువ్వులా ఆ తల్లి నేలచూపు చూసింది. 'నిన్నే అడిగేది?' అంటూ పోలీస్‌ ఆవేశం గదులు ప్రతిధ్వనించింది. పులి గర్జనకు లేడి భయంతో చెంగుచెంగున ఉరికినట్టే.. అధికారి ఆవేశానికి తిరుపత్త గజగజా వణికిపోతూ నాలుగడుగుల వెనక్కి వేసింది. ఏదో మాట్లాడాలని నోరు విప్పబోతోంది. మనసులోని మాటను బయటపెట్టడానికి ఆగిపోతోంది. ఏమి చేయాలో తెలియక, ఏం చెప్పాలో తోచక ఆమె సతమతవుతోంది. ఒకవైపు భయం వణికిస్తోంది. గుండె వేగం పెరిగిపోతోంది. చెమటలు
కథలు

మిస్టర్ ఏ

విజయవంతమైన వ్యక్తి  జీవిత కథను మనం చదివినప్పుడు, వారు వారి జీవితంలోని సవాళ్లను ఎలా  అధిగమించారు అనే దాని గురించి మనకు చాలా అంతర్దృష్టిని అందిస్తుంది. ఈ పాఠాలు మన జీవితాలను నడపటానికి,  మన ప్రియమైనవారి కోసం మంచి భవిష్యత్తును ప్లాన్ చేయడంలోను  సహాయపడతాయి. నిజానికి మిస్టర్ ఏ  భారత ఆర్థిక వ్యవస్థ  ఆకాశంలో మెరిసే నక్షత్రం. మిస్టర్ ఏ, అంబానీల తర్వాత రెండవ సంపన్న కుటుంబం. కానీ ఇతర వ్యాపార దిగ్గజాల మాదిరిగా కాకుండా, మిస్టర్ ఏ తన తండ్రి నుండి అదృష్టాన్ని వారసత్వంగా పొందలేదు. బదులుగా, అతను తన విధిని మార్చడానికి చాలా కష్టపడ్డాడు. మిస్టర్ ఏ  విజయగాథను పరిశీలిస్తే,  అతని బలమైన
కథలు

ఎకనమిక్స్‌

వారం కింద. ఒకరోజు.  ఉదయం ఇంటర్వెల్‌ అయిపోయింది. అంతా ఎవరి క్లాసులకు వాళ్ళం పోతున్నాం. నేను టెన్త్‌ క్లాస్‌  గదిలోకి వెళ్ళాను. సెంటు వాసన గుప్పు మంటోంది. బోర్డువైపు చూశాను. ఇంగ్లీష్‌ టీచర్‌ ఆరోజు థాట్‌ ఫర్‌ ది డే ఇలా రాశారు. If  you light a lamp for someone elseIt  will also brighten your own path బోర్డు తుడుస్తూ ఆలోచిస్తున్నాను. ఎకనామిక్స్‌లో కొంచెం కవర్‌ చేద్దామనుకున్నాను. బోర్డువైపు తిరిగి  టాపిక్‌ రాసేంతలో  కిరణ్‌ కంప్లయింట్‌ ‘‘మేడం, మేడం శ్రావణ్‌ సెంటు తెచ్చాడు’’             కంప్లయిట్స్‌ పర్వం మొదలైౖంది. రఘు కూడా తెచ్చాడు,
కథలు

వెన్నెల వసంతం

ఈ కథ ఇప్పుడు మరోమారు చదివా.  అప్పుడెప్పుడో రాంగూడా హత్యాకాండ సమయంలో రాసినా ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న హత్యాకాండల నెత్తుటి తడి మనకు తగులుతుంది. ఒకసారి కథలివి వెళితే ..  . ఇప్పుడు అమ్మలేదు. ఆమె జ్ఞాపకాలు తప్ప. అమ్మ అరుణ. అమ్మ డైరీలో భద్రపర్చుకున్న జ్ఞాపకాలను తనలోకి ఒంపుకుంటుంది వెన్నెల. అమ్మా - వసంత్ అమ్మ అరుణ.మరి వసంత్ ఎవరు? అమ్మ జీవితంలోకి వసంతే వచ్చాడో! వసంత్ జీవితంలోకి అమ్మే వెళ్ళిందో కానీ, ఇద్దరూ కలిసి జీవితాన్ని పంచుకోలేకపోయారు. అమ్మ 'కుటుంబం'గదిలో ఇరుక్కుపోయింది. వసంత్, అడవిలో వసంతమై విరబూసిండు. ఆదివాసిని అంతం చేసి ...అడవిని ఆక్రమించి
కథలు

డిజిటల్ ప్రేమ

“వద్దు, వద్దు, మనం వర్షంలో తడవ కూడదు. అందుకే ఆ చెట్టు దగ్గరకు వెళదాం. అమ్మా పరిగెత్తు  తొందరగా” అని అలేఖిని  పరిగెత్తే లోపలే  వర్షం చుక్కలు కనికరం లేకుండా ఆమె మీద పడ్డాయి. కొన్ని నిమిషాల ఫోటో షూట్ తర్వాత, ఫోటోలు ఆమెకు సంతృప్తికరంగా ఉన్నాయో లేదో చూసుకుంది. తల్లి కూతుళ్లు ఇద్దరూ స్థలాలను మార్చుకున్నారు. చివరగా, కొన్ని సెల్ఫీల తర్వాత, వారు సమీపంలోని షెల్టర్‌కి పరుగెత్తారు. వారు ఉత్సాహంగా ముసిముసిగా నవ్వుతూ, మంచి వాటిని ఎంచుకోవడానికి కష్ట పడ్డారు. క్లిక్ చేసిన ఫోటోలను సెలెక్ట్ చేశారు. ఎంచుకున్న వాటిని సరైన ఫిల్టర్‌, లైటింగ్, కాంట్రాస్ట్ మొదలైన
కథలు

భయం, అభద్రత

ఇవ్వాల్టి  సగటు ముస్లిం జీవితం ఈ కథలో ఉంది. నేటి పెహెల్గాం సందర్భమే కాదు. నిన్నటి కరోనా సందర్భమూ కూడా ముఖ్యంగా మోషాల నాయకత్వంలో బీజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భయం! అభద్రత! మరీ ఎక్కువయ్యింది. చదువుకున్నవారు చదువురానివారు అనే తేడా లేదు. వయసు బేధం అంతకూ లేదు. మతం మత్తు ఎక్కితే చాలు. అందులో భాగమే చదువుకున్న రఘు"రోజూ చాలా మంది ముస్లింలు మన దేశానికి వస్తున్నారట. అట్లా వచ్చి ఇక్కడే ఉండిపోయి బాంబులు పెట్టి జనాలను చంపేస్తున్నారట" అంతా "అట" ప్రచారమే. వాస్తవ  పరిశీలన ఉండదు. మంచీ చెడుల ఆలోచన ఉండదు. నిజనిజాలకు తావేలేదు.
కథలు హస్బెండ్ స్టిచ్ - 3

ఇరవై నాలుగు గంటలు – పది మైళ్ళు

ఆ స్త్రీలు యుగాలుగా నడుస్తున్నారు..నడుస్తూనే ఉన్నారు…యుగాలుగా వంటింట్లో... అమ్మమ్మ.. నానమ్మ.. ముత్తమ్మ  .. అమ్మ.,పిన్ని, అక్క, అత్త.. కోడళ్లు ,భార్యలు  , కూతుర్లు ., ఇంకా చాలా మంది  గుస గుస లాడుతూ.. మూల్గుతూ .. కొన్నిసార్లు ఒకరితో ఒకరు  కొట్లాడుతూ,,అరుచుకుంటూ   బట్టలు నాని పోయేంతగా చెమటలు కక్కుతూ ! కత్తులూ .. ఫోర్కులూ .. గరిటెలు.. ఉడుకుడుకి పోతూ ఆవిర్లు కక్కుతూ అరిచరిచి  ఆగిపోయే కుక్కర్లు .. బజ్జీలతో కాగి కాగి ., మసలి మసలి పోయే బాండళ్ళు..        కప్పులూ.. సాసర్లు .. వణికే వేళ్ళతో పట్టుకుంటూ .. జారవిడుస్తూ ! ఆ స్రీల 
ఎరుకల కథలు

ఎర్రమన్ను, ముగ్గుపిండి

నాగులకుంటలో తెల్లవారింది. మేనపాటి నరసింహులు సైకిల్ బెల్లు గణగణ లాడిస్తూ వీధిలోకి వచ్చాడు. అప్పటికింకా ఉదయం  ఆరు కూడా కాలేదు సమయం.ఎంత బలంగా బెల్లు నొక్కుతున్నా కుడిచేతి  బొటనవేలు నొప్పి పెడుతోంది, కానీ బెల్లు అంతగా మోగడం లేదు. అప్పటికే లేచి తయారైన పిల్లలు అక్కడక్కడా బిగ్గరగా పాఠాలు చదువుకుంటున్న చప్పుడు వినిపిస్తోంది. దినపత్రికలు వేసే కుర్రాళ్ళు ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడుతూ హుషారుగా నవ్వుకుంటూ  రివ్వున దూసుకు వెడుతున్నారు సైకిళ్ళపైన. తనూ కదులుతూనే వాళ్ళ సైకిళ్ళని తదేకంగా చూస్తూ , తన  సైకిల్ వైపు తలవంచి  పరీక్షగా చూసుకున్నాడు. సైకిల్ మరీ పాతబడిపోయింది. ముందులాగా వేగంగా,
కథలు

మనసుడికి పోతే…

రిక్షా అప్పన్న కూతురు పెళ్లంట. ఆడి పెద్ద కూతురు మల్లీశ్వరికి పద్నాలుగేళ్లుంటాయి. ముగ్గురు కూతుళ్ల తరువాత ఒక్కడే మొగ్గుంటడు పుట్టాడు అప్పన్నకి. అప్పన్నకి తాను తోలే రిక్షా కాకుండా పన్నెండు బళ్లు అద్దెకు తిరుగుతాయి. చెయ్యెత్తు మనిషైనా అప్పన్నకి ఒక కాలు బోదకాలు అవ్వడం చేత ఎక్కువగా రిక్షా తొక్కడు. బళ్ల అద్దెలు వసూలు చేసుకుంటాడు. అతని అన్నదమ్ములందరిదీ ఒకటే వాసని పెంకుటిళ్లు. చూడముచ్చటగా ఉంటాయి. ఎలమంచిల్లోని మాలపల్లంతటికీ అప్పన్నే మోతుబరి. అప్పన్న అక్క ఒకావిడ రంగం ఎల్లి బోల్డు బంగారం, డబ్బు తెచ్చిందనీ, అన్నదమ్ములకి ఒక కాపు కాసిందనీ చెప్పుకుంటారు. రంగవప్పయ్యమ్మకి ఈ ఊర్లో ఒక మొగుడున్నాడు.