వ్యాసాలు

చీకట్లో మిణుగురులు

(డిసెంబర్లో విరసం ప్రచురించిన మిడ్కో కథల సంపుటి *మెట్లమీద *కు  రాసిన ముందుమాట ఇది . అమర యోధ రేణుక స్మృతిలో పాఠకుల కోసం .. వసంతమేఘం టీం ) మిడ్కో అంటే గోండు భాషలో మిణుగురు పురుగుఅట. అంటే చీకట్లో మెరిసే ఒక ప్రాణి. ఒక నక్షత్రం. ఒక ప్రాణి తాను చీకటిలో మెరిసి వెలుగుచూపే ఒక ప్రక•తి నిర్మాణం విచిత్రమైనది. అద్భుతమైనది. గాలిలో అడవిలో ముఖ్యంగా చీకట్లో చూసినపుడు కాని దీని విశిష్టత అర్థంకాదు. అట్లే ఒక ఆరిద్ర పురుగుంది. మ•గశిర కార్తె రాగానే పొలాల్లో బిలబిల వచ్చే కుంకుమపువ్వు వంటి ఒక పురుగు. నిజానికి
వ్యాసాలు

చుండూరు దళిత ప్రజా పోరాటానికి మద్దతు నీయండి

(చుండూరు మార‌ణ కాండ మీద అక్టోబ‌ర్ 1991న విప్లవ రచయితల సంఘం, జనసాహితీ సాస్కృతిక సమాఖ్య, ప్రజా రచయితల సమాఖ్య త‌ర‌పున విడుద‌ల చేసిన ఈ క‌ర‌ప‌త్రాన్ని సి. రామ్మోహ‌న్‌గారు రాశారు. ఆయ‌న స్మృతిలో పున‌ర్ముద్ర‌ణ‌) చుండూరు దళిత ప్రజా పోరాటానికి మద్దతు నీయండి భూస్వామ్య, దోపిడి, పీడన సంస్కృతులను నేలమట్టం చేయండి. గురజాడ, వీరేశలింగం పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణగారల సంఘ సంస్మరణోద్యమానికి గుంటూరు జిల్లా కేంద్రస్థానం, త్రిపురనేని హేతువాదఉద్యమం, జమీందరీ వ్యతిరేక ఉద్యమాలు, గుంటూరు జిల్లాను కదిలించివేసినవి. పన్నుల సహాయనిరాకరణ ఉద్యమం, పల్నాడు రైతాంగ తిరుగుబాటు, కన్నెగంటి హనుమంతు అమరత్వం చరిత్రలో ప్రత్యేకతను సంతరించుకున్నవి. ఆధునిక సాహిత్యంలో
వ్యాసాలు సమీక్షలు

కులం-బహుజన ప్రజాస్వామిక విప్లవ దశ… కొన్ని ప్రశ్నలు, పరిమితులు

‘’కులం బహుజన ప్రజాస్వామిక విప్లవ దశ’’ అనే ఈ పుస్తకంలో సామాజిక మార్పును చారిత్రకంగా, భౌతికవాద దృష్టితో పరిశీలిస్తూ, అందులో భాగంగా కుల సమస్యను సీరియస్ గా  తీసుకొని విశ్లేషించి రాసిన వ్యాసాలున్నాయి. అందువల్ల ఇది అందరూ చదవాల్సిన ముఖ్యమైన పుస్తకం.        అయితే ఒక పుస్తకం ముఖ్యమైన మంచి పుస్తకం అని అంటున్నానంటే అందులోని విషయాలన్నింటి పట్ల పూర్తి ఏకీభావం ఉన్నట్టు కాదు. ముఖ్యంగా ఇందులో రచయిత పట్టా వెంకటేశ్వర్లు గారు చేసిన కొన్ని నిర్ధారణల పట్ల నాతో సహా కొందరు మార్క్సిస్టు లకు విభేదం ఉండవచ్చు. అవి విప్లవ కమ్యూనిస్టులకు సంబంధించినవి అయినందువల్ల మాత్రమే కాక
వ్యాసాలు

గుండెలపై రాసుకున్న గోండుల సాహిత్యం

సాహు (కొమురం భీమ్‌ నవలా రచయితలలో ఒకరైన సాహు ఆఖరి వ్యాసం. 1993 ఫిబ్రవరి 13, 14 తేదీలలో హైదరాబాద్లో జరిగిన దళిత రచయితల, కళాకారుల మేధావుల ఐక్యవేదిక రాష్ట్ర మహాసభలలో ఈ వ్యాసాన్ని సమర్పించారు. మార్చి 16 ఆయ‌న వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఈ వ్యాసాన్ని పున‌ర్ముద్రిస్తున్నాం.-  వ‌సంత‌మేఘం టీమ్)  సూర్య వంశ దేవతల్‌  కేత దర్శ సితార  సూర్య వంశ రాజధాని  మావబూడె మాతారా  కచ్చీ బాండేగ్‌ మావాసొత్తా  కయ కాల్‌ కుటియాతా  మావా రాజ్‌ బుడేమాతా  సూర్య వంశ దేవతల అంశంగా చెప్పుకునే గిరిజనులు వాళ్ళ రాజ్యాలు పతనమయి, క్షతగాత్రులై ఆయుధాలు కోల్పోయి అడవులలో జంతువుల్లా వేటాడబడుతూ
వ్యాసాలు

థ‌ల్‌ముత్తు, నాట్యరాజన్‌ల‌ను స్మ‌రించుకుందాం  

హిందుత్వ కౌటిల్య మాతృభాషా వాదం భాష అలోచనల ప్రత్యక్ష వాస్తవానికి రూపం - మార్చ్‌థ‌ల్‌ముత్తును త‌ల‌చుకోనివాడునాట్య‌రాజ‌న్‌ను గుర్తు చేయనివాడుతేనెలొలుకు ప‌లుకుల‌తో ఎంతభాషాభిమానాన్ని చాటుకున్నాచాణక్య‌నీతి చెల్ల‌దుగాక చెల్ల‌దుబ్రాహ్మ‌ణ దుర‌హంకార‌వాదంహిందీ ఆధిప‌త్య దుర‌భిమానంమ‌ట్టిగ‌ర‌వ‌క త‌ప్ప‌దు మన ప్రియమైన భారత దేశం అనేక భాషలకు, సంప్రదాయాలకు, జాతులకు, మూలవాసుల సముదాయాలకు, సంస్కృతులకు నిలయం. వైవిధ్యం దీని ప్రత్యేకత. వాటిని సంరక్షించుకోవడం మనందరి విధి. అవి ఈనాడు పెనుముప్పును ఎదుర్కొంటున్నాయి. వాటి అస్తిత్వం తీవ్ర ప్రమాదంలో ఉంది. తెగలు లుప్తమవుతున్నాయి. భాషలు అడుగంటిపోతున్నాయి. తర తరాల వారసత్వ సంపద వినాశనపు అంచులలో అస్థిత్వానికై కొట్టుమిట్టాడుతున్నవి. యేడాది పొడుగుతా ఐక్య రాజ్య సమితి పేరు మీదనో,
వ్యాసాలు

విప్లవాచరణ కథలు

(డిసెంబర్లో విరసం ప్రచురించిన మిడ్కో కథల సంపుటి *మెట్లమీద *కు రాసిన ముందుమాట ఇది . అమర యోధ రేణుక స్మృతిలో పాఠకుల కోసం .. వసంతమేఘం టీం ) ముందుమాట కోసం పోస్టులో వచ్చిన పద్దెనిమిది కథలు గత అయిదు నెలలుగా చదువుతూ ఆలోచిస్తున్నాను. ఈ కథలు చదువుతూ ఉంటే మేము ఇదివరకు యువ రచయితలకు నిర్వహించిన పాఠశాలలు ముఖ్యంగా 1997 వేసవికాలంలో అరకులోయలో శ్రీ కాళీపట్నం రామారావు, ఆర్.యస్. రావుగారి లాంటివారు విచ్చేసి పదిరోజులు నడిపిన పాఠశాల గుర్తొచ్చింది. రాష్ట్రం మొత్తం నుండి వచ్చిన యువ రచయితలు, రచయిత్రులు (అర్ధ రాత్రుల దాకా చదివిన కథలు)
వ్యాసాలు

కార్పొరేట్ విస్తరణ – ఆదివాసీల ప్రతిఘటన

మహారాష్ట్రలోని సుర్జాగఢ్‌ గ్రామంలోనూ, మహారాష్ట్ర కొండలలోనూ ఆదివాసీ నిరసనకారులు, నాయకులు విపరీతమైన అణచివేతను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా సూర్జాగఢ్ ప్రాంతం కేంద్రంగా కార్పొరేటికరణ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో లాయిడ్ మెటల్ కంపెనీ గణితవ్వకాల విస్తరణ కోసం సత్వర కార్పొరేటీకరణకు లొంగిపోవాలని స్థానిక సముదాయాల మీద రాజ్యం – కార్పొరేట్ శక్తులు ఒత్తిడి తీసుకు వస్తున్నాయి. నవంబర్ 20న, మహారాష్ట్రలోని సుర్జాగఢ్‌లోని నిరసన ప్రదేశాన్ని పారామిలటరీ బలగాలు చుట్టుముట్టి విధ్వంసం చేసాయి. ఎనిమిది మంది క్షేత్రస్థాయి కార్యకర్తలను వారి గ్రామాల్లో గాలించి పట్టుకుని, అరెస్టుచేసి,  జీపుల్లో తీసుకెళ్ళడం అనే సాధారణ పద్ధతిని వదిలేసి, హెలికాప్టర్ల ద్వారా అదే రాష్ట్రంలోని
సాహిత్యం వ్యాసాలు

కథానికా విమర్శకుడుగా సింగమనేని

కథలు  రాయటం ఎంత సులువో అంత కష్టం కూడా. గాలిలో తేలిపోయే కథలు రాయటానికి పెద్ద శ్రమ ఉండదు. ఊహల్లో అల్లుకున్న ఇతివృత్తాలతో కథలు రాయటమంటే మరీ సులభం. ఎటొచ్చీ, జీవితం పట్ల పరిశీలన ఉండే, జీవతం నుండే ప్రేరణ పొందీ, జీవిత వాస్తవికతను పాఠకుడికి అందించగలందుకు రాయటం మాత్రం కష్టమయిన పనే అని నేను ఒప్పుకుంటాను’’(సింగమనేని : కథ రాయటం గురించి కొంచెం, కథలెలా రాస్తారు సంకలనం 1992)  ప్రతి రచయితా ఒక విమర్శకుడే అనే మాట చాలా కాలం నుంచీ వినిపిస్తున్నది. ప్రాచీన కావ్యావతారికలో అప్పటి కవులు కవిత్వం, కావ్యం వంటి వాటి గురించి చెప్పిన
వ్యాసాలు సంభాషణ

పాలకవర్గాలలో మరో కలకలం

సెప్టెంబర్‌ మూడవ వారంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా టీ.ఓ.ఐ. (టాయ్‌) లో సౌమిత్రాబోస్‌ ఒక వార్త రాశాడు. మావోయిస్టులు భద్రతా బలగాలలోకి, దుర్గా వేడుకలలోకి, స్లమ్స్‌ లలోకి తమ శక్తులను చొప్పంచడానికి నూతన పథకం రూపొందిస్తున్నారనీ శీర్షిక పెట్టాడు. పోలీసుల, భద్రతా బలగాల ఇబ్బందులను అవకాశంగా తీసుకొని సానుభూతిపరులను సమీకరించుకోవడం; మహారాష్టలో మావోయిస్టులకు సంబంధించిన 84 అనుబంధ సంఘాల పైన ఇప్పటికీ ప్రజా భద్రతా చట్టం అమలులో వుంది; తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌ లలో ఆ చట్టాన్ని వినియోగించుకొనే పట్టణాలలో వారి ప్రమాదాన్నిలేకుండా చేశారు అనే హైలైట్స్‌ పెట్టాడు. ఆ పక్కనే పార్టీ భావజాలాన్ని వ్యాపింపచేయడానికి స్థానికులను
వ్యాసాలు

ఆదివాసులను పరిహసించే  ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’  

బిర్సా ముండా ఊరు ఉలిహతు (ఖుంటి) నుంచి ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 నవంబర్ 15న ప్రారంభించారు.  ఇది ప్రభుత్వ విజయాల ప్రచారం కోసం అని చెబుతున్నారు కానీ వాస్తవానికి ఇది 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ యాత్ర. కార్యక్రమానికి బీజేపీ రంగు పులిమేందుకు ప్రభుత్వ అధికారులకు రథ బాధ్యులు అని పెట్టిన పేరును, ప్రజల నిరసనతో నోడల్ అధికారిగా మార్చారు. మోడీ ప్రతిష్టను మెరిపించడానికి చేస్తున్న ఈ యాత్ర డబ్బు వృధా తప్ప మరొకటి కాదని, ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకంగా ఉందని జార్ఖండ్‌లోని అనేక ప్రజా సంస్థలు, సామాజిక