సాహిత్యం వ్యాసాలు

అస్తిత్వ కవితా ప‌తాక  

‘‘అప్పుడప్పుడూ చావు చింత చీకట్లో కుక్కలా వెంటాడుతుంటుంది’’ ఎండ్లూరి సుధాక‌ర్ మస్తిష్కం బద్దలై ఉబికి వచ్చిన కవిత *చావును చంపండి*.  తన జీవితానికిలా ఈ రకంగా  ముగింపు పలుకుతాడని ఊహించినవాళ్లెవ‌రూ ఉండ‌కపోవచ్చు. అస్తిత్వజెండాని గుండెలనిండా బతుకు పోరాటం చేసిన నిఖార్సైన కవి ఎండ్లూరి సుధాకర్‌. బతుకంటే అతడికి ముమ్మాటకీ యుద్దమే.  ఆధునిక కవిత్వం మల్లెమొగ్గల గొడుగులా కవిత్వపు నీడనిస్తున్న కాలం నుండి రాస్తున్న కవుల్లో తొలిగా దళిత అస్తిత్వ ఉద్యమ కవిత్వాన్ని అక్షరీకరించినవాడు. తన జీవితమంతా ఉద్యమయ్యే సాగింది. కవిత్వాన్ని ఉద్యమానికి ఆయుధంగా వాడినవాడు. బహుశా ఈ కాలపు మహోజ్వలిత దళిత ఉద్యమకారుడు. అతడి కవిత్వం నిండా ఆర్తి,
వ్యాసాలు

విమర్శనాత్మక దృక్పథం లేకపోతే విప్లవమే లేదు

రచయితలారా మీరెటు వైపు అని శ్రీ శ్రీతో సహా రచయితలను ప్రశ్నించకపోతే విప్లవ రచయితల సంఘమే లేదు. ఆ శ్రీ శ్రీ అయినా ఇరవై సూత్రాల పథకాన్ని పొగుడుతూ కవిత్వం రాసినప్పుడు విరసం ఆయనను సస్పెండ్ చేసింది. అంతెందుకు విప్లవోద్యమంలో ప్రజాపంథాకు, దండకారణ్య ఉద్యమానికి సైద్ధాంతిక బీజాలు నాటి సెట్ బ్యాక్ కు గురైన విప్లవోద్యమాన్ని పునాదుల నుండి నిర్మించిన కొండపల్లి సీతారామయ్యపై కూడా విమర్శనాత్మక దృక్పథం లేకపోతే ఈనాటి విప్లవోద్యమం 1990 ల తరువాత ఏ దిశలో వెళ్ళేదో ఊహకు కూడా అందని విషయం. భారత విప్లవోద్యమానికి ‘లెజెండరీ’గా ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ను ఎవరు కాదనగలరు?
వ్యాసాలు

పోస్కో దారిలోనే జిందాల్ పోక త‌ప్ప‌దు

నేప‌థ్యంః దక్షిణ కొరియా స్టీల్ కంపెనీ పోస్కో కోసం  ఒడిశా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న  వ్యవసాయ భూమిని  రైతులు పోరాడి సాధించుకున్నారు. ఈ పోరాటం ద‌శాబ్దంపైగా న‌డిచింది. సుమారు 3,000 వ్యవసాయ కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి.    ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం అదే భూమిని భారతీయ ఉక్కు కంపెనీకి అప్పగించింది. తిరిగి ఆ ప్రాంతం మళ్లీ నిరసనలు, ఘర్షణల‌తో అట్టుడుకుతున్న‌ది. ఎప్ప‌టిలాగే పోలీసుల క్రూరత్వంతో అల్లకల్లోలమైంది. ధింకియా, నవ్‌గావ్, గడకుజంగా అనే మూడు గ్రామ పంచాయతీల పరిధిలోని ఎనిమిది గ్రామాలలో దాదాపు 20,000 మంది  ఉంటున్నారు. వారిలో  అత్యధికులు షెడ్యూల్డ్ కులాలకు (SC) చెందినవారు. వీరు 60% కంటే
వ్యాసాలు

ప్రజల ప్రజాస్వామ్య ప్రతిఘటనను  దెబ్బతీసేoదుకై   మారణహోమ సైనిక విధానం

బస్తర్ చరిత్ర అంటేనే పోరాటాల చరిత్ర. తమ భూమిని, జీవితాలను, ప్రకృతి వనరులను దోచడమే గాక, తమ స్వీయ గౌరవాన్ని దెబ్బతీసే శక్తులను బస్తర్ తీవ్రంగా ప్రతిఘటించింది. అలాంటి తిరుగుబాట్లలో 1910 లో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన  భూంకాల్ తిరుగుబాటు ఒకటి. గుండాదుర్ అనే ఆదివాసీ నాయకత్వాన ఆదివాసీలు వలసవాదుల అటవీ మరియు ప్రకృతి వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. నాటినుండి నేటిదాకా, బస్తర్ లో లభించే అపారమైన ప్రకృతి వనరుల దోపిడీకి వేచి చూస్తున్న దేశ, విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాల రక్షణకై ప్రభుత్వo చేస్తున్న సైనికీకరణను, బస్తర్ ప్రజలు సాయుధంగా ఎదుర్కొంటూనే వున్నారు. పూనెం సోమ్లి ఒక
వ్యాసాలు

హర్యానాలో ఇళ్ళ కూల్చివేత- కోర్టులో కేసు

హర్యానాలో జూలై 31 హింసాకాండ తరువాత, నూహ్, గురుగ్రామ్ ప్రాంతాలలో ప్రభుత్వం అక్రమ భవనాలను కూల్చివేసేందుకు బుల్డోజర్లను నడిపింది. 57 ఎకరాలకు పైగా అక్రమ ఆక్రమణను ప్రభుత్వం తొలగించినట్లు చెబుతున్నారు. అయితే, హైకోర్టు ఈ విషయాన్ని గమనించి, బుల్డోజర్ ఆపరేషన్‌పై నిషేధం విధించింది. హర్యానాలోని నూహ్‌లో  జరిగిన హింసాకాండ తర్వాత బుల్డోజర్ చర్యపై హైకోర్టులో జరుగుతున్న వాదనలు వాయిదా పడ్డాయి. ఈ కేసు ఇప్పుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో హైకోర్టు సుమోటో (స్వయంచాలకం)గా స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాధానం కోరింది. దీనిపై 2023, ఆగస్టు 13న హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది.
వ్యాసాలు

చినబోయినలచ్చుమమ్మ కొడుకు

గద్దరన్న ఇక లేడని తెలిసినప్పటి నుండి చాలా బాధగా  వుంది. ఏ పనిలో ఉన్నా ఆయనే తెగ గుర్తుకొస్తున్నాడు. ఆయన గత కొంత కాలంగా విప్లవోద్యమానికి భిన్నమైన  దిశలో పనిచేయడం, తన పాత దృక్పథానికి భిన్నంగా మాట్లాడడం చూస్తున్నాం. ఒకప్పుడు మీడియాలో ప్రచారం కావడానికి ఇష్టపడన కళాకారుడు ఆయన. ఇప్పుడు మీడియాలో ప్రచారానికి అభ్యంతరం చెప్పకపోవడం, ఎవరు పిలిచినా ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆయనని గమనిస్తున్న అభిమానులంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా 2014 నుండి   ఆయన విప్లవ పంథాకు, భౌతికవాద భావాజాలనికి పూర్తిగా స్వస్తి పలికి, పార్లమెంట్ పంథాకి, భావవాదంలోకి మారిపోయాడని సాహసల్  మీడియాలో ఆయన వీడియోల్లో పాటలు, మాటలు
వ్యాసాలు

పోరాట ప్రజల గుండె  డప్పులు

(1981లో వచ్చిన *గద్దర్‌ పాటలు* పుస్తకానికి రాసిన ముందుమాట) ఆటా పాటా మాటా? ఆటా పాటా మాటా - మూడూ ఏది యేదో విడిగా కనిపించనంత ముప్పేటగా ఒక కవి - గాయకుడిలో కలవడం, ఆదిమ మానవ గణ జీవితాన్ని ఆధునిక కాలంలో ప్రస్తుత క్షణంలో అపురూపంగా చూపించ గలుగుతూంది. అశేష ప్రేక్షక/ శ్రోతల్ని మెప్పించగలుగుతూంది. ఇది సర్వసాధారణ విషయమైతే ఇక్కడ ప్రస్తావించవలసిన పని లేదు. సులభమైతే పేర్కోవడం అనవసరం. అనుకరించడానికి గూడా అందని సూక్ష్మం ఏదో ఇమిడి వుంది యీ కళా యింద్రజాలంలో ` అందుకే నిజంగా కూడా ఈనాడు గద్దర్‌ను చూపాకనే ఇంకెవరినైనా చూపాలి. ఒడ్డూ
వ్యాసాలు

నిర్ధాక్షిణ్యమైన కార్పొరేటీకరణ, హైందవీకరణ ఫలితం మణిపుర్ విధ్వంసం. 

అమానవీయ మనువాద పర్యవసానం మహిళల నగ్నప్రదర్శన మణిపుర్ లోని కాంగ్పోక్పి జిల్లాలో ఇద్దరు మహిళల నగ్న ప్రదర్శన, వారిలో 21 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం దేశాన్ని కుదిపివేసింది. ఆమె 56 ఏళ్ల తండ్రిని, 19 ఏళ్ల సోదరున్ని కాల్చి చంపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ప్రదర్శనను చూపుతూ 26 సెకన్ల వీడియో వైరల్ కావడంతో మణిపుర్ లో మనువాదం ఎలా బుసలు కొడుతుందో వెల్లడైంది. యావద్దేశవాసులు ఆ దారుణానికి చలించిపోయారు. విదేశీయులు సైతం నిర్ఘాంతపోయారు. ‘‘కనిపిస్తే కాల్చివేత’’ ఆదేశాలు, 10 వేల మంది అదనపు భారత సైన్యాల మొహరింపు మధ్య ఈ దారుణం జరిగింది. దేశంలోని
వ్యాసాలు

మరో హిందుత్వ విషసర్పం 63 పేజీల కల్పిత రహస్య దస్తావేజు

భీమా కోరేగాం కేసును సృష్టించిన హిందుత్వ శక్తులు గత ఐదేళ్లుగా దేశ విదేశాలలో అత్యంత అప్రతిష్ట పాలు కావడంతో ఎన్ఐఏ ప్రస్తుతం మరో కేసుకు రంగం సిద్ధం చేస్తున్నది. భీమా కోరేగాం కేసులో అసలు నేరస్థులను పక్కన పెట్టి ఈ దేశంలోని లౌకిక, ప్రగతిశీల, ప్రజాస్వామిక, దేశభక్త శక్తులను (కళాకారులు, రచయితలు, వకీళ్లు, పాత్రికేయులు, ప్రొఫెసర్లు, ఆదివాసీ  శ్రేయోభిలాషులు, సామాజిక కార్యకర్తలు మున్నగువారు) కక్ష పూరితంగా కటకటాల వెనుకకు నెట్టిన హిందుత్వ శక్తుల కౌటిల్యం గతంలో ఏ కేసులోనూ కానంత నగ్నంగా వెల్లడైంది. భీమా కోరేగాం కేసు అనేక మలుపులు, మెలికలు తిరిగి హిందుత్వ శక్తుల థింక్ టాంకుల
సాహిత్యం వ్యాసాలు

కుల వివక్షను ఎత్తిపట్టిచూపిన ‘‘గోసంగి’’ కావ్యం

ఉత్పత్తి పై ఆధిపత్యం పాంపాదించుక్ను వర్గాలు సాహిత్య కళృారంగాలపై కూడా తమ పెత్తనాన్ని కొనసాగిస్తాయి.న మనిషి భాష నేర్చి నాటినుంచి కథ కవిత్వం వుంటున్నదన్నది సత్యం. ఉత్పత్తిపై ఆధిపత్యంకోల్పోయిన  కారణంగా ఉత్పత్తిని చేసిన వర్గాలు సాహిత్య కళా రంగాలపై కూడా ఆధిపత్యంలేని వారయ్యారు. ఇది ఎలా జరిగిందన్న చర్చ ప్రస్తుతం కాదు. ఉత్పత్తి వర్గాల సాహిత్యం మౌఖికంగానే మిగిలిపోయింది. సంపదేకాదు అక్షరాన్ని కైవసం చేసుకున్న వర్గాల ఉత్పత్తి వర్గాన్ని విస్మరించాయి. ఒకవేళ ఉత్పత్తి వర్గాల ప్రసక్తి వచ్చినా వక్రీకరించో, తమ ప్రతి పాఠ్యాంశానికి కావలసిన విధంగానూ వాడుకున్నారు. ప్రబంధ యుగమంతా విశిష్టాద్వైత ప్రచార సాహిత్యమని త్రిపురనేని మధుసూదనరావు గారంటారు.