పత్రికా ప్రకటనలు

శిశువును చంపిన భద్రతా దళాలు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ముత్వెండి గ్రామంలో 2024 జనవరి 1న మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో 6 నెలల పసికందు మృతి చెందిందని మూల్‌వాసి బచావో మంచ్ (బస్తర్) చేసిన విజ్ఞప్తి మా దృష్టికి వచ్చింది. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లోనే మృతి చెందినట్లు బస్తర్ ఐజీ పి.సుందర్‌రాజ్‌ అంటుంటే, మావోయిస్టులతో ఎలాంటి ఎన్‌కౌంటర్‌ ఘటన జరగలేదని మృతి చెందిన చిన్నారి తండ్రి సోది ఆరోపించారు. ఓ హిందీ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన బిడ్డకు ఆహారం పెడుతున్న మస్సీ వడ్డెపై అడవి నుంచి వచ్చిన భద్రతా బలగాలు విచక్షణారహితంగా కాల్పులు
పత్రికా ప్రకటనలు

మావోయిస్టు పార్టీ మీద, విప్లవ ప్రజా సంఘాల మీద నిషేధాన్ని ఎత్తివేయాలి

(మావోయిస్టు పార్టీ మీద, విప్లవ ప్రజా సంఘాల మీద నిషేధాన్ని ఎత్తివేయాలి, తెలంగాణ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌-1992ను రద్దు చేయాలి అనే డిమాండ్ల మీద డిసెంబర్‌ 30 శనివారం హైదరాబాదులో ఉదయం 10.30 నుంచి సాయంకాలం 5 గంటల దాకా విరసం నిర్వహించిన   రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ నోట్‌) ప్రజాస్వామ్యం అంటేనే వేర్వేరు రాజకీయాల మధ్య సంభాషణ. ప్రజలు తమకు ఇష్టమైన రాజకీయాలను ఎంచుకోవడం.  వ్యక్తిగతంగా తమ అభివృద్ధికి, ప్రగతికి ఏ రాజకీయాలు కావాలో నిర్ణయించుకొనే స్వేచ్ఛ ఉండటం. పార్టీలుగా, సంస్థలుగా సంఘటితమై వాటిని ఆచరించడం. మొత్తంగానే సమాజ వికాసానికి ఏ రాజకీయాలు దోహదం చేస్తాయో  నిరంతర చర్చ కొనసాగడం.
పత్రికా ప్రకటనలు Press notes

Freedom for Palestine means:”An independent Palestinian state,from the Jordan Riverto the Mediterranean Sea”!

The daily genocide of the Palestinian people by the murderous state of Israel continues unabated, but also the heroic resistance of this people which causes a massive wave of support demonstrations across the planet. After a month, however, beyond the anger and indignation, the question inevitably arises in the minds of the world: What must be done to achieve justice for the struggling people of Palestine? This question cannot be
పత్రికా ప్రకటనలు

వేదాంత రహస్య ప్రయత్నాలు

COVID-19 భారతదేశం అంతటా వ్యాపించడంతో, చమురు, గనుల పరిశ్రమలను నియంత్రించే కీలక పర్యావరణ భద్రతా నిబంధనలను పలుచన చేయడానికి గని త్రవ్వకాల- చమురు సంస్థ వేదాంత కంపెనీ చడీ చప్పుడు లేకుండా ప్రభుత్వాన్ని తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేసింది. అదానీ అవకతవకలపై హిండెన్‌బర్గ్‌ రిపోర్టుకు మద్దతుగా ఓ తాజా నివేదికను తెచ్చిన ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌ (ఓసిసిఆర్‌పి) కరోనా సమయంలో వేదాంత గ్రూప్‌ జరిపిన రహస్య లాబీయింగ్‌, దానికి పర్యావరణ చట్టాల్లో కేంద్రం చేసిన సవరణలపై మరో రిపోర్టును ఇచ్చింది. ఓసిసిఆర్‌పి నివేదిక ముఖ్యాంశాలు: - కోవిడ్ సమయంలో కీలక పర్యావరణ నిబంధనలను
పత్రికా ప్రకటనలు

గ్రోవ్ వాసుకు మద్దతుగా  విద్యార్థి సంఘాలు 

తేదీ: సెప్టెంబర్ 7, 2023 కార్పొరేట్ సంస్థలు, ఫాసిస్టులు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేరళ అంతటా అనేక నిరసనలకు నాయకత్వం వహించిన, గ్రో వాసు అనే పేరుతో ప్రసిద్ది చెందిన వాసును జైలులో నిర్బంధించి అతని పౌర హక్కులకు భంగం కలిగించడాన్ని విద్యార్థులమైన మేము సమైక్యంగా ఖండిస్తున్నాము. ఏడేళ్ల నాటి కేసులో, 2016 నవంబరు 24న సీఎం పినరై విజయన్ నేతృత్వంలోని హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేరళ పోలీసుల థండర్ బోల్ట్ కమాండోల చేత హత్యకు గురైన, అనారోగ్యంతో ఉన్న అజిత, కుప్పు దేవరాజ్ అనే ఇద్దరు మావోయిస్టుల బూటకపు ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా కోజికోడ్ మెడికల్
పత్రికా ప్రకటనలు

ఆయనకు ఆ శిక్ష చాలదు

యాసిన్‌మాలిక్‌ను ఉరితీయాలన్న ఎన్‌ఐఏ వాదనలను ఖండించండి  యావజ్జీవ ఖైదీగా ఉన్న కశ్మీర్‌ పోరాట నాయకుడు యాసిన్‌మాలిక్‌ను ఉరి తీయాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మే 29న ఢల్లీి కోర్టులో వాదించింది. ఇటీవల ఎన్‌ఐఏ దాఖలు చేసిన పిటీషన్‌ మీద తుషార్‌మెహతా కోర్టులో తమ వాదనలు వినిపిస్తూ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం వంటి అత్యంత ప్రమాదకరమైన, అరుదైన నేరానికి పాల్పడినందు వల్ల యాసిన్‌ మాలిక్‌కు ఇప్పుడు విధించిన శిక్ష సరిపోదని, ఉరిశిక్ష విధించాలని కోరాడు. ఆయన చేసిన నేరాల తీవ్రతను చాటడానికి ఒసామాబిన్‌ లాడెన్‌ పేరు కూడా ప్రస్తావించాడు. ఇలాంటి కఠినమైన శిక్షలు విధించకపోతే నిరంతరం ఎవరో ఒకరు సాయుధ
పత్రికా ప్రకటనలు

రాజ దండం పాలనలో క్రీడాకారులపై దాడి

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బట్టబయలు చేస్తూ, రాజ్యాంగ ఆదర్శాలను అవహేళన చేస్తూ, ఇది అధికారికంగా కూడా హిందుత్వ రాజ్యమని ప్రకటిస్తూ మే 28న కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని అనేక రాజకీయ పార్టీలు బహిష్కరించాయి. అట్లాగే  మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై   చర్యలు తీసుకోవాలని కోరుతూ చాలా కాలంగా  పోరాడుతున్న క్రీడాకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశ ప్రతిష్టను క్రీడాకారులు దశ దిశలా వ్యాపింపజేస్తారని పొగిడే పాలకులు న్యాయమైన డిమాండ్‌ మీద రాజీపడకుండా పోరాడుతోంటే తమ సహజమైన అణచివేత చర్యలకు
పత్రికా ప్రకటనలు

ఆదివాసుల మీద వైమానిక దాడులుఎందుకు చేస్తున్నారు?

ఆహ్వానందండకారణ్యం శతృదేశమా?ఆదివాసుల మీద వైమానిక దాడులు ఎందుకు చేస్తున్నారు?చర్చా కార్యక్రమం21 మే, 2023 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5.30 దాకా మిత్రులారా చత్తీస్‌ఘడ్‌లోని ఆదివాసీ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా డ్రోన్లు, హెలికాప్టర్లతో దాడులు చేస్తున్న సంగతి మీకు తెలిసిందే.  ఈ దాడులు మొదట 2021 జూన్‌ 19న బీజాపూర్‌ జిల్లాలో బొట్టలంక, పాలగూడెం గ్రామాల మీద మానవ రహిత డ్రోన్లతో  12 బాంబులు వేయడంతో మొదలయ్యాయి. ఆ తర్వాత 2022 ఏప్రిల్‌ 14, 15 తేదీల మధ్య రాత్రి బీజాపూర్‌, సుక్మా జిల్లాల మధ్య ఉన్న బొట్టెంతోగె, మెట్టగూడెం, దులోడ్‌, సక్లెట్‌,
పత్రికా ప్రకటనలు

బైరి నరేష్‌ పై హిందుత్వ మూకల దాడి

నరేష్‌పై హిందుత్వ శక్తులు ఫిబ్రవరి 27న మరోసారి దాడికి పాల్పడ్డాయి. ఈసారి పోలీసుల సమక్షంలోనే  దాడి జరిగింది.   మనోభావాలు దెబ్బతిన్న భక్తుల మూక ఈ పని చేసిందా? లేక కేసీఆర్‌ ప్రభుత్వ అండతో చెలరేగిపోయి దాడికి దిగిందా? అనే ప్రశ్నలు చాల మామూలు వాళ్లకు కలిగేలా ఈ ఘటన జరిగింది. నరేష్‌ అభిప్రాయాలేవైనా సరే... అవి ఆయన భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగం. హేతుబద్ధ చర్చకు ఆస్కారం ఇవ్వదల్చుకోని వాళ్లే తరచూ మనోభావాల పేరుతో ఉన్మాద చర్యలకు పాల్పడుతుంటారు. ఇది ఫాసిస్టు లక్షణం. నరేష్‌పై దాడి వల్ల నాస్తిక, హేతువాడ, ప్రగతిశీల, విప్లవ శక్తులకు ఫాసిస్టు శక్తులు ఒక
పత్రికా ప్రకటనలు

వైద్య విద్యార్థి ప్రీతిబలవన్మరణానికి కారకులెవరు?

అసమానత, హింస, వివక్ష ఉన్న సమాజంలో జరిగే బలవన్మరణాలన్నీ సామాజిక హత్యలే. వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజ్‌ పీజీ మొదటి సంవత్సరం విద్యార్థి డాక్టర్‌ ప్రీతి ఫిబ్రవరి 22న బలవన్మరణానికి గురైంది. ఇది  మన సమాజ దుస్థితిని తెలియజేస్తోంది. స్త్రీలు  ఇంట్లో, సమాజంలో  ఆత్మగౌరవంతో జీవించడానికి  చాలా ఘర్షణ అనుభవించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఒక దశ దాటాక వారు ఆత్మహత్య వైపు నెట్టివేయబడుతున్నారు. మన సమాజం నాగరికంగా ఎదగలేదని చెప్పడానికి ప్రీతి బలవన్మరణం ఉదాహరణ.                 సమాజంలోలాగే ఉన్నత విద్యా రంగంలో  కూడా పితృస్వామ్య, ఆధిక్య భావజాలం కొనసాగే అవకాశం ఉంది. ఈ సమస్యను సకాలంలో పరిష్కరించగల