కథలు

వెన్నెల వసంతం

ఈ కథ ఇప్పుడు మరోమారు చదివా.  అప్పుడెప్పుడో రాంగూడా హత్యాకాండ సమయంలో రాసినా ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న హత్యాకాండల నెత్తుటి తడి మనకు తగులుతుంది. ఒకసారి కథలివి వెళితే ..  . ఇప్పుడు అమ్మలేదు. ఆమె జ్ఞాపకాలు తప్ప. అమ్మ అరుణ. అమ్మ డైరీలో భద్రపర్చుకున్న జ్ఞాపకాలను తనలోకి ఒంపుకుంటుంది వెన్నెల. అమ్మా - వసంత్ అమ్మ అరుణ.మరి వసంత్ ఎవరు? అమ్మ జీవితంలోకి వసంతే వచ్చాడో! వసంత్ జీవితంలోకి అమ్మే వెళ్ళిందో కానీ, ఇద్దరూ కలిసి జీవితాన్ని పంచుకోలేకపోయారు. అమ్మ 'కుటుంబం'గదిలో ఇరుక్కుపోయింది. వసంత్, అడవిలో వసంతమై విరబూసిండు. ఆదివాసిని అంతం చేసి ...అడవిని ఆక్రమించి
కథలు

డిజిటల్ ప్రేమ

“వద్దు, వద్దు, మనం వర్షంలో తడవ కూడదు. అందుకే ఆ చెట్టు దగ్గరకు వెళదాం. అమ్మా పరిగెత్తు  తొందరగా” అని అలేఖిని  పరిగెత్తే లోపలే  వర్షం చుక్కలు కనికరం లేకుండా ఆమె మీద పడ్డాయి. కొన్ని నిమిషాల ఫోటో షూట్ తర్వాత, ఫోటోలు ఆమెకు సంతృప్తికరంగా ఉన్నాయో లేదో చూసుకుంది. తల్లి కూతుళ్లు ఇద్దరూ స్థలాలను మార్చుకున్నారు. చివరగా, కొన్ని సెల్ఫీల తర్వాత, వారు సమీపంలోని షెల్టర్‌కి పరుగెత్తారు. వారు ఉత్సాహంగా ముసిముసిగా నవ్వుతూ, మంచి వాటిని ఎంచుకోవడానికి కష్ట పడ్డారు. క్లిక్ చేసిన ఫోటోలను సెలెక్ట్ చేశారు. ఎంచుకున్న వాటిని సరైన ఫిల్టర్‌, లైటింగ్, కాంట్రాస్ట్ మొదలైన
కథలు

భయం, అభద్రత

ఇవ్వాల్టి  సగటు ముస్లిం జీవితం ఈ కథలో ఉంది. నేటి పెహెల్గాం సందర్భమే కాదు. నిన్నటి కరోనా సందర్భమూ కూడా ముఖ్యంగా మోషాల నాయకత్వంలో బీజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భయం! అభద్రత! మరీ ఎక్కువయ్యింది. చదువుకున్నవారు చదువురానివారు అనే తేడా లేదు. వయసు బేధం అంతకూ లేదు. మతం మత్తు ఎక్కితే చాలు. అందులో భాగమే చదువుకున్న రఘు"రోజూ చాలా మంది ముస్లింలు మన దేశానికి వస్తున్నారట. అట్లా వచ్చి ఇక్కడే ఉండిపోయి బాంబులు పెట్టి జనాలను చంపేస్తున్నారట" అంతా "అట" ప్రచారమే. వాస్తవ  పరిశీలన ఉండదు. మంచీ చెడుల ఆలోచన ఉండదు. నిజనిజాలకు తావేలేదు.
కథలు హస్బెండ్ స్టిచ్ - 3

ఇరవై నాలుగు గంటలు – పది మైళ్ళు

ఆ స్త్రీలు యుగాలుగా నడుస్తున్నారు..నడుస్తూనే ఉన్నారు…యుగాలుగా వంటింట్లో... అమ్మమ్మ.. నానమ్మ.. ముత్తమ్మ  .. అమ్మ.,పిన్ని, అక్క, అత్త.. కోడళ్లు ,భార్యలు  , కూతుర్లు ., ఇంకా చాలా మంది  గుస గుస లాడుతూ.. మూల్గుతూ .. కొన్నిసార్లు ఒకరితో ఒకరు  కొట్లాడుతూ,,అరుచుకుంటూ   బట్టలు నాని పోయేంతగా చెమటలు కక్కుతూ ! కత్తులూ .. ఫోర్కులూ .. గరిటెలు.. ఉడుకుడుకి పోతూ ఆవిర్లు కక్కుతూ అరిచరిచి  ఆగిపోయే కుక్కర్లు .. బజ్జీలతో కాగి కాగి ., మసలి మసలి పోయే బాండళ్ళు..        కప్పులూ.. సాసర్లు .. వణికే వేళ్ళతో పట్టుకుంటూ .. జారవిడుస్తూ ! ఆ స్రీల 
ఎరుకల కథలు

ఎర్రమన్ను, ముగ్గుపిండి

నాగులకుంటలో తెల్లవారింది. మేనపాటి నరసింహులు సైకిల్ బెల్లు గణగణ లాడిస్తూ వీధిలోకి వచ్చాడు. అప్పటికింకా ఉదయం  ఆరు కూడా కాలేదు సమయం.ఎంత బలంగా బెల్లు నొక్కుతున్నా కుడిచేతి  బొటనవేలు నొప్పి పెడుతోంది, కానీ బెల్లు అంతగా మోగడం లేదు. అప్పటికే లేచి తయారైన పిల్లలు అక్కడక్కడా బిగ్గరగా పాఠాలు చదువుకుంటున్న చప్పుడు వినిపిస్తోంది. దినపత్రికలు వేసే కుర్రాళ్ళు ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడుతూ హుషారుగా నవ్వుకుంటూ  రివ్వున దూసుకు వెడుతున్నారు సైకిళ్ళపైన. తనూ కదులుతూనే వాళ్ళ సైకిళ్ళని తదేకంగా చూస్తూ , తన  సైకిల్ వైపు తలవంచి  పరీక్షగా చూసుకున్నాడు. సైకిల్ మరీ పాతబడిపోయింది. ముందులాగా వేగంగా,
కథలు

మనసుడికి పోతే…

రిక్షా అప్పన్న కూతురు పెళ్లంట. ఆడి పెద్ద కూతురు మల్లీశ్వరికి పద్నాలుగేళ్లుంటాయి. ముగ్గురు కూతుళ్ల తరువాత ఒక్కడే మొగ్గుంటడు పుట్టాడు అప్పన్నకి. అప్పన్నకి తాను తోలే రిక్షా కాకుండా పన్నెండు బళ్లు అద్దెకు తిరుగుతాయి. చెయ్యెత్తు మనిషైనా అప్పన్నకి ఒక కాలు బోదకాలు అవ్వడం చేత ఎక్కువగా రిక్షా తొక్కడు. బళ్ల అద్దెలు వసూలు చేసుకుంటాడు. అతని అన్నదమ్ములందరిదీ ఒకటే వాసని పెంకుటిళ్లు. చూడముచ్చటగా ఉంటాయి. ఎలమంచిల్లోని మాలపల్లంతటికీ అప్పన్నే మోతుబరి. అప్పన్న అక్క ఒకావిడ రంగం ఎల్లి బోల్డు బంగారం, డబ్బు తెచ్చిందనీ, అన్నదమ్ములకి ఒక కాపు కాసిందనీ చెప్పుకుంటారు. రంగవప్పయ్యమ్మకి ఈ ఊర్లో ఒక మొగుడున్నాడు.
ఎరుకల కథలు

వెదుర్లు

అక్కడ యుద్ధం జరిగినట్లు వుంది. మృత కళేబరాల్లా ఉన్నాయి టమోటా మొక్కలు. సైనికుల దండయాత్రేదో జరిగినట్లుంది. పొలమంతా నానా భీభత్సంగా వుంది.  టమోటాలు చితికిపోయి నలిగిపోయి వున్నాయి. ఎకరా  పొలంలో ఎక్కడా ఒక మొక్క బతకలేదు. ఒక్క టమోటా కూడా మిగల్లేదు. ఎరుకల దొరస్వామి గుండెలవిసేలా ఏడుస్తున్నాడు. పక్కనే అతడి భార్య ఏడో నెల గర్భిణి నీలమ్మ కండ్లల్లో  నీళ్ళు పొంగుతున్నాయి. ఆమె పక్కనే ఆరేళ్ళ కుర్రాడు. రాజు దిక్కుతోచకుండా అమ్మానాన్నల వైపు బిత్తరపోయి చూస్తూ వున్నాడు. ఏం జరిగిందో, టమోటా పంట మొత్తం ఎందుకిట్లా నాశనం అయ్యిందో, అమ్మానాన్న ఎందుకట్లా ఏడుస్తున్నారో వాడికి అస్సలు అర్థం కాలేదు.
కథలు

మెట్ల మీద

"రవీందర్ ఎక్కాల్సిన మెట్లు ఎక్కనూ లేక, ఎక్కిన మెట్లు దిగనూ లేక సందిగ్ధంలో నిలబడిపోయాడు" ఎవరీ రవీందర్? ఎందుకీ సందిగ్ధత? తెలంగాణ విప్లవోద్యమ ఉద్యమ ప్రతిభావిత గ్రామం నుండి అజ్ఞాతంలోకి వెళ్లి పదిహేనేళ్ల తర్వాత తిరిగొచ్చాడు. సత్తువ లేకనో చైతన్యమే కొరవడిందో తిరిగొచ్చి సాధారణ జీవితం గడపాలనుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన నజరానా కూడా వద్దనుకొని సాదాసీదాగా ఉండాలనుకున్నాడు. ఐనా ఏదో సందిగ్ధత. యాదమ్మకు తన ముఖం చూపించలేకపోతున్నాడు. ఎవరీ యాదమ్మ? ఐలయ్య తల్లి. తన ప్రభావంతో ఎదిగి ఉద్యమంలో చేరి అమరుడయ్యాడు. ఇప్పుడా తల్లికి ఏం సమాధానం చెప్పాలి. ఎట్లా తన ముఖం చూపించాలి . సమాజం పట్ల
ఎరుకల కథలు

చప్పుడు

“శీనుగా టీ తీసుకురా...." వెంకట రెడ్డి కేకేసాడు. ఆ కేకతో శీనుగాడు అనబడే కావాటి గునయ్య శ్రీనివాసులు అనబడే సర్పంచు ఆ ఊరి రెడ్డి గారి ఇంట్లోకి పరుగున వెళ్లాడు. రెడ్డిగారింట్లో హాల్లో ఎంఆర్ఓ, ఎండిఓ, ఇఒఆర్డి, పంచాయతి సెక్రటరి, ఇంకా ఇద్దరు ముగ్గురు ఊరి పెద్దలనబడే  పెద్ద కులాల వాళ్లు కూర్చుని ఉన్నారు. అందరిలోనూ ఏదో దర్పం తొంగిచూస్తోంది. గుమ్మం బయట తలారి నిలబడి హాల్లోకి తొంగిచూస్తున్నాడు.  ఎంతైనా రెడ్డిగారు రెడ్డిగారే. ఆఫీసర్ల ఆఫీసర్లే. జవాను జవానే ఆఖరికి తలారోడూ తలారోడే. ఎటొచ్చి శ్రీనివాసులు మాత్రం శ్రీనివాసులు కాకుండా పోయాడు. సర్పంచు సర్పంచు కాకుండా పోయాడు. ఎందుకంటే
కథలు

Hey! Show Me Your Papers!

"Yes, I am faithful to the Indian Constitution! I am a watchdog of the Constitution, " Khadar mumbled and rolled on the bed, not sleeping a wink. It was March. Across the starlit and cloudless sky on a new Moon night, the light was playing hide-and-seek. Khadar lay lying under the open sky. Though the cool breeze tickled him, the pestering thoughts made him restless. The rickety cot creaked while